NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Group 1 Exams: రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత..
    తదుపరి వార్తా కథనం
    Group 1 Exams: రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత..
    రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత..

    Group 1 Exams: రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2024
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన ఆందోళనలు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశాయి.

    రేపటి (21 వ తేదీ) నుండి 27 వ తేదీ వరకు జరగనున్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అధిక దృష్టి పెట్టింది.

    జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు.

    పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సక్రమమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

    వివరాలు 

    31,382 అభ్యర్థులు హాజరు 

    ఈ పరీక్షలకు మొత్తం 31,382 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

    జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయని, పరీక్షలు నిర్భందంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

    2011 సంవత్సరం తరువాత, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

    హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

    ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

    వివరాలు 

    కంట్రోల్ రూమ్ ఏర్పాటు 

    TGPSC కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

    మధ్యాహ్నం 1:30 తర్వాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని, గేట్లు మూసివేయబడతాయని చెప్పారు.

    పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. దివ్యాంగులకు అదనంగా ఒక గంట సమయం కేటాయిస్తామని తెలిపారు.

    పరీక్షా కేంద్రాల వద్ద అన్ని అవసరమైన వైద్య వసతులు ఉంటాయని, ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ లక్ష రూపాయలకు తులం బంగారం బంగారం
    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా

    తెలంగాణ

    TG Rains: తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు.. హెచ్చరిక జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం  భారతదేశం
    Digital Card: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు..కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం కరీంనగర్
    Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ వర్షాకాలం
    Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025