NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి
    తదుపరి వార్తా కథనం
    AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి
    మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి

    AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 13, 2024
    02:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం,విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో మాట్లాడుతూ, మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు, జాబ్ చార్టులపై సంబంధిత శాఖలతో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

    ఈ విషయమై సభ్యులు తమ సలహాలు, సూచనలు అందించాలన్నారు.

    గ్రామ సచివాలయాల్లో మహిళా సంరక్షణ కార్యదర్శుల బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గౌరు చరితారెడ్డి, మాధవిరెడ్డి అభ్యర్థించారు.

    వారికి సమాధానంగా, గత ప్రభుత్వం యాక్టుల గురించి అవగాహన లేకుండా జీవోలు జారీ చేసిందని మంత్రి అనిత విమర్శించారు.

    వివరాలు 

    ఆరు శాఖల కలయికతో వారికి జాబ్ చార్టు

    2019లో రిక్రూట్ మెంట్ సమయంలో మహిళా పోలీసులుగా నియామకం చేసినప్పుడు ఎలాంటి ట్రైనింగ్ లేదా పరీక్షలు నిర్వహించలేదని, 15 వేల మందిని రిక్రూట్ చేస్తే, అందులో 13,815 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారని తెలిపారు.

    2021లో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మార్చేందుకు మరొక జీవో విడుదల చేసి, సుమారు ఆరు శాఖల కలయికతో వారికి జాబ్ చార్టును ఇచ్చారని పేర్కొన్నారు.

    చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయో.. అన్ని బాధ్యతలు వీరికి ఇచ్చారని ఇది జగన్ ప్రభుత్వం అవివేకానికి నిదర్శనమని విమర్శించారు.

    పోలీస్ శాఖలో నియామకాలకు సంబంధించిన దేహధారుడ్య పరీక్షలు, రాత పరీక్షలు, సరైన ట్రైనింగ్ అవసరం ఉంటుందని, కానీ కేవలం రెండు వారాల ట్రైనింగ్‌తోనే మహిళా సంరక్షణ కార్యదర్శులను నియమించారని వ్యాఖ్యానించారు.

    వివరాలు 

    నియామక విధానంపై కోర్టుల్లో ఏడు పిటిషన్లు

    మహిళా సంరక్షణ కార్యదర్శులకు పలు శాఖలతో సంబంధం ఉండటంతో అవి సమస్యలకు దారితీస్తున్నాయని, గత ప్రభుత్వ అవివేకంతో ఈ నియామక విధానంపై కోర్టుల్లో ఏడు పిటిషన్లు కూడా దాఖలయ్యాయని తెలిపారు.

    ఈ విధులపై స్పష్టత లేకపోవడంతో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని అసెంబ్లీలో చెప్పారు.

    ఈ సందర్భంగా సభ్యులు తాము చేయగలిగిన సలహాలు, సూచనలు అందించాలని, తద్వారా శాశ్వత నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    ఆంధ్రప్రదేశ్

    AP Govt: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ బదిలీ ఇండియా
    High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం హైకోర్టు
    Free gas cylinder: ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి కానుక.. 'ఉచిత గ్యాస్‌' బుకింగ్స్‌ ప్రారంభం  భారతదేశం
    Nara Lokesh: ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం నారా లోకేశ్‌ కసరత్తు నారా లోకేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025