NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
    తదుపరి వార్తా కథనం
    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
    భారీగా ఆస్తి నష్టం

    శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో భారీ అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 31, 2023
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మేరకు దాదాపు 15 షాపులు మేర దగ్ధమయ్యాయి.

    శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం సన్నిధిలోని లలితాంబికా దుకాణ సముదాయంలో గురువారం తెల్లవారుజామున హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

    మంటలు క్రమేపీ L- బ్లాకులోని మిగిలిన దుకాణాలకూ అంటుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు, తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

    సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.

    DETAILS

    దాదాపుగా రూ.2 కోట్ల మేర నష్టం 

    మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలోనే ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 14 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి.

    మరోవైపు మంటలు ఇతర దుకాణాలకు విస్తరించకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. మరోవైపు ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని, దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

    భారీ అగ్ని ప్రమాదం ధాటికి దాదాపుగా రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీశైలం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    శ్రీశైలం

    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్

    ఆంధ్రప్రదేశ్

    విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స.. యువతి పొట్టలో వెంట్రుకల చుట్ట తొలగింపు  ప్రభుత్వం
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం టీటీడీ
    స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి రోడ్డు ప్రమాదం
    పాకిస్థాన్ మహిళ 'హనీట్రాప్'లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్  విశాఖపట్టణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025