NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం
    తదుపరి వార్తా కథనం
    తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం
    భద్రాచలం వద్ద ఉద్ధృతం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం

    తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 20, 2023
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది.

    సాయంత్రం నీటిమట్టం 43 అడుగులకు చేరే అవకాశాలున్నాయి. మరోవైపు 43 అడుగుల మేర ప్రవాహం ఉంటే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అన్నదాన సత్రం వద్దకు వరద చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపేశారు.

    ఈ మేరకు 24 గంటల పాటు కంట్రోల్ రూములను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. జల్లా కలెక్టర్ కార్యాలయం సహా కొత్తగూడెం,భద్రాచలం ఆర్డీవో ఆఫీసుల్లో కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

    మరోవైపు చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం,మణుగూరు, పినపాక మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సహాయ కేంద్రాలను సిద్ధం చేశారు.

    DETAILS

    వాగులు, వంకలను  ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు : కలెక్టర్ 

    వరదల్లో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ముందస్తు సహాయ చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు.

    ప్రజలకు కలెక్టర్ సూచనలు :

    భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, వాటిని దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.

    మత్స్యకారులకు అలెర్ట్ :

    వరదల నేపథ్యంలో గంగపుత్రులు, మత్స్యకారులు చేపల వేటను వాయిదా వేయాలన్నారు. పశువులను మేతకు వదలకుండా ఇంటి వద్దే ఉంచాలన్నారు.

    కాళేశ్వరంలో జలకళ :

    రాష్ట్రంలో మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణీ సంగమం జలకళ సంతరించుకుంది. ఈ మేరకు గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.

    DETAILS

    పోలవరం వద్ద 30.680 మీటర్లుగా కొనసాగుతున్న నీటిమట్టం

    కాళేశ్వరం వద్ద ప్రస్తుతం 9.980 మీటర్ల మేర నీటి మట్టం కొనసాగుతోంది. తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రాణహిత జలకళ సంతరించుకుంది.

    బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు :

    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా తాడిచర్ల ఓపెన్ కాస్ట్‌ గనిలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. కాటారం - మేడారం రహదారిలో కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య పెద్దవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న క్రమంలో రాకపోకలను నిలిపేశారు.

    పోలవరానికి వరద :

    గోదావరికి భారీ వరద ప్రారంభయ్యాక ఏలూరు జిల్లాలోని పోలవరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం వద్ద నీటిమట్టం 30.680 మీటర్లుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 3,15,791 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

    DETAILS

    గండి పోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద 

    గోదావరి నదికి భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ క్రమంలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికార యంత్రానికి ఆదేశాలు జారీ చేసింది.

    లోతట్టు గ్రామాల వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు ముంపు పెరుగుతోందని అధికారులు సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది.

    ఈ సందర్బంగా గండి పోచమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ వరద నీరు చేరుకుంది. ఈ క్రమంలోనే గోపురం వరకు నీరు చేరుకోవడం గమనార్హం.

    పరిస్థితిని సమీక్షించిన దేవాదాయశాఖ అధికారులు, అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపేశారు. ఇదే సమయంలో ఆలయ సన్నిధిలోని స్థానికులు దుకాణాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గోదావరి నదీ
    భారీ వర్షాలు
    వరదలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    గోదావరి నదీ

    గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు గంగపుత్రులు

    భారీ వర్షాలు

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  ఉత్తరాఖండ్
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు తెలంగాణ
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  దిల్లీ

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025