NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు
    సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు

    Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 29, 2024
    01:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఒకే ఏడాదిలో సైబర్ నేరగాళ్లు రూ. 1,229 కోట్లను దోచుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

    2024లో పోలీసులకు 7,23,378 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు, ఇది రికార్డుగా నిలిచింది. ఈ ఏడాదిలో సగటున రోజుకు సైబర్ నేరగాళ్లు రూ. 3.36 కోట్లను దోచుకున్నట్లు డీజీపీ వివరించారు.

    2023లో 4,74,391 ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరాలు జరిగి, 682 కేసుల్లో రూ. 173 కోట్ల నష్టాన్ని బాధితులు అనుభవించారు.

    2024లో ఫిర్యాదుల సంఖ్య 52.4 శాతం పెరిగింది. బాధితులు 610 శాతం ఎక్కువ సొత్తును కోల్పోయారు.

    Details

    గంజాయి కేసులు అధికం

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి, మాదకద్రవ్యాలపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నా గంజాయి కేసులు గత కాలం కన్నా ఎక్కువగా నమోదయ్యాయి.

    మొత్తం నేరాలపై గతేడాది 97,760 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 92,094 కేసులకు పరిమితమైంది.

    హత్యలు, హత్యాయత్నాల కేసులు తగ్గినప్పటికీ, లాభం కోసం హత్యలు, దోపిడీలు, మరియు పగలు, రాత్రి వేళల్లో ఇళ్లలో దోంగతనాలు ఎక్కువగా జరిగాయి.

    మహిళల హత్యలు పెరిగినా, అత్యాచారాలు, వరకట్న చావులు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు గణనీయంగా తగ్గాయి.

    2023లో ఆంధ్రప్రదేశ్‌లో 18,597 రోడ్డు ప్రమాదాల్లో 8,136 మంది మరణించగా, 20,977 మంది గాయపడ్డారు. 2024లో 17,688 రోడ్డు ప్రమాదాల్లో 7,863 మంది మరణించగా, 19,711 మంది గాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఇండియా

    తాజా

    OG: పవన్ కళ్యాణ్ 'ఓజీ' రిలీజ్ డేట్ ఖరారు.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    GT vs CSK : విజృంభించిన చైన్నై బ్యాటర్లు.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం చైన్నై సూపర్ కింగ్స్
    US Report: భారత ప్రథమ శత్రువు చైనానే.. DIA 2025 త్రెట్ రిపోర్ట్‌లో వెల్లడి! చైనా
    Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్‌ రిలీజ్ కుబేర

    ఆంధ్రప్రదేశ్

    Andrapradesh: బిగ్ అలర్ట్.. రెండు వారాల్లో మూడు అల్పపీడనాలు బంగాళాఖాతం
    CM Chandrababu: పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో విశ్వవిద్యాలయం.. ఏపీలో త్వరలో స్థాపన చంద్రబాబు నాయుడు
    Rajya Sabha : ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం  రాజ్యసభ
    Andhrapradesh: జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి.. జిల్లా అధికారులకు ఆదేశాల జారీ భారతదేశం

    ఇండియా

    Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్‌.. కేంద్రం కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం
    Delhi: రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో కంక్రీట్ వాల్, రోడ్డుపై మేకులు దిల్లీ
    Heavy Snow : హిమాచల్‌లో మంచు దుప్పటి కప్పేసింది.. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు హిమాచల్ ప్రదేశ్
    Warangal Airport: భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వరంగల్ రైతులు.. ఎయిర్ పోర్టు పునరుద్ధరణలో సవాల్ వరంగల్ తూర్పు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025