NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు
    తదుపరి వార్తా కథనం
    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు
    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు

    ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు

    వ్రాసిన వారు Stalin
    Mar 13, 2024
    10:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

    హైదరాబాద్‌ను విముక్తి చేసిన అమరవీరులను స్మరించుకునేందుకు, యువతలో దేశభక్తిని నింపేందుకు భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17వ తేదీని హైదరాబాద్‌ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఇదే డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పింది.

    'ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13నెలల వరకు హైదరాబాద్‌కు రాలేదు. అప్పటి వరకు హైదరాబాద్ నిజాం పాలనలోనే మగ్గింది.

    1948సెప్టెంబర్ 17న "ఆపరేషన్ పోలో" అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుంచి విముక్తి పొందింది ' అని హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

    కేంద్రం

    గతేడాది విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమిత్ షా

    గతేడాది సెప్టెంబర్ 17న 'ముక్తి దివస్'గా పిలువబడే హైదరాబాద్ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని నిజాం సైన్యం, రజాకార్లకు (నిజాం పాలనకు సాయుధ మద్దతుదారులు) వ్యతిరేకంగా పోరాడిన వీర జవాన్లకు నివాళులర్పించారు.

    పరేడ్ గ్రౌండ్ కార్యక్రమంలో హోంమంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు.

    ఈ కార్యక్రమంలో షా ప్రసంగిస్తూ.. దేశంలోని గత ప్రభుత్వాలను ఎండగడుతూ, మభ్యపెట్టే విధానాల వల్ల ఏ ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోలేదన్నారు.

    ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి వెనుకాడుతున్నాయన్నారు.

    1948లో హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ
    తాజా వార్తలు
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    హైదరాబాద్

    Traffic Challans: పెండింగ్‌ ట్రాఫిక్ చలాన్‌లపై 90శాతం వరకు తగ్గింపు.. నేటి నుంచి చెల్లించుకోవచ్చు  తెలంగాణ
    Praja Bhavan Accident: ప్రజాభవన్‌ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే  బోధన్
    Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు  మెట్రో రైలు
    Hyderabad Drunk And Drive : కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఎన్నంటే!  భారతదేశం

    తెలంగాణ

    Telangana Budget: నేడు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి  బడ్జెట్ 2024
    Telangana Budget: తెలంగాణ బడ్జెట్ @ రూ.2,75,891 కోట్లు.. ఆరు గ్యారంటీలకు భారీగా కేటాయింపులు బడ్జెట్ 2024
    Telangana Budget: రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రుణమాఫీపై కీలక ప్రకటన  రేవంత్ రెడ్డి
    Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత  పెద్దపల్లి

    తాజా వార్తలు

    మార్చి 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    Surat: పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా వెళ్లిన కారు.. వీడియో వైరల్  గుజరాత్
    Delhi Borewell Accident: ఆడుకుంటూ వెళ్లి.. బోరు బావిలో పడిన చిన్నారి దిల్లీ
    Hibiscus Tea: షుగర్ రాకుండా ఉండాలంటే ఈ టీ తాగండి క్యాన్సర్

    కేంద్ర ప్రభుత్వం

    RBI: రూ.1000 నోటు రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ ఆర్ బి ఐ
    మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్రం సీరియస్.. ఆరుగురు నిపుణులతో కేంద్రం కమిటీ తెలంగాణ
    Electoral bonds:రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు: కేంద్రం సుప్రీంకోర్టు
    Apple : 'మా ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి'.. అలెర్ట్‌ నోటిఫికేషన్లు పంపిన యాపిల్‌ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025