NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad Literary Festival: హైదరాబాద్‌ వేదికగా సాహితీ పండగ.. 24 నుంచి 26 వరకు నిర్వహణ
    తదుపరి వార్తా కథనం
    Hyderabad Literary Festival: హైదరాబాద్‌ వేదికగా సాహితీ పండగ.. 24 నుంచి 26 వరకు నిర్వహణ
    హైదరాబాద్‌ వేదికగా సాహితీ పండగ.. 24 నుంచి 26 వరకు నిర్వహణ

    Hyderabad Literary Festival: హైదరాబాద్‌ వేదికగా సాహితీ పండగ.. 24 నుంచి 26 వరకు నిర్వహణ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో జరిగే సాహితీ పండగ (లిటరరీ ఫెస్టివల్ -హెచ్‌ఎల్‌ఎఫ్‌) 24 నుండి 26 వరకు హైటెక్‌ సిటీ లోని సత్వ నాలెడ్జ్‌ సిటీ, టీ హబ్‌లలో నిర్వహించనున్నారు.

    ఈ పండగ వివిధ రంగాలకు సంబంధించిన అనేక అంశాలను కవర్ చేస్తుంది. అందులో సాహిత్యం, శాస్త్రం,వైద్యం,పర్యావరణం,నూతన ఆవిష్కరణలు,పిల్లలకు కథలు చెప్పడం, సరైన సాహిత్యం వంటి అంశాలు ఉంటాయి.

    అదేవిధంగా, పుస్తకావిష్కరణలు, ఎగ్జిబిషన్లు, థియేటర్ కార్యక్రమాలు, యువతతో చర్చలు, కొత్త ఆలోచనలను ప్రేరేపించే ప్రదర్శనలు కూడా ఈ పండగలో భాగంగా ఉంటాయి.

    కాలేజీ, పాఠశాల విద్యార్థులకు కూడా అనేక ప్రదర్శనలు లభించనున్నాయి. పాఠశాల విద్యార్థులు నుంచి శాస్త్ర సాంకేతిక రంగం, హక్కుల ఉద్యమం తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి.

    వివరాలు 

    హాజరయ్యే ప్రముఖులు వీరే.. 

    ఇందులో పాల్గొనే ప్రముఖులు వివిధ రంగాలకు చెందినవారు. వీరందరికీ వారి ప్రతిభ కారణంగా మంచి గుర్తింపు ఉంది.

    ప్రముఖ వైద్యురాలు సౌమ్య స్వామినాథన్, చరిత్రకారుడు రాజ్‌మోహన్‌గాంధీ, హక్కుల కార్యకర్త అరుణారాయ్,ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు, యాక్టర్-డైరెక్టర్‌ అమోల్‌ పాలేకర్, సినీ నటి షబానా ఆజ్మీ, సాహిత్య అకాడమీ గ్రహీతలు అనితానాయర్,అంజు మఖిజా,థియేటర్‌ డైరెక్టర్‌ అమల్‌ అల్లన, సినీ నటి హ్యుమా ఖురేషి,సినీ నటుడు సిద్ధార్థ వంటి ప్రముఖులు ఈ సాహితీ పండగలో పాల్గొంటున్నారు.

    ఈ పండగను తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు,ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ నేతృత్వంలో ఏర్పడిన కమిటీ విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తోంది.

    2010 నుండి ఈ సాహితీ పండగ కార్యక్రమాలు ప్రతి ఏడాది జరుగుతూనే ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Raviteja : పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన రవితేజ,కిషోర్ తిరుమల మూవీ  రవితేజ
    Sachin Tendulkar: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం.. సంతాపం వ్యక్తం చేసిన స‌చిన్‌ సచిన్ టెండూల్కర్
    Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా? బెంగళూరు
    Gold Rate: పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. బంగారం

    హైదరాబాద్

    Telangana: హైదరాబాద్‌'కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము .. ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్‌ సమీక్ష ద్రౌపది ముర్ము
    Book fair : హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌.. ఈ నెల 19 నుంచి పుస్తకాల పండుగ  రేవంత్ రెడ్డి
    Mohan Babu: మోహన్‌బాబుకు చికిత్స పూర్తి.. గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ టాలీవుడ్
    Hyderabad Weather: వణుకుతున్న రాష్ట్రం.. చలి తీవ్రత కారణంగా ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చలికాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025