NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్
    తదుపరి వార్తా కథనం
    'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్
    దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది: జమియత్ చీఫ్

    'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్

    వ్రాసిన వారు Stalin
    Feb 11, 2023
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ముస్లింలు వ్యతిరేకం కాదని, అయితే వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతున్నాయని జమియత్ ఉలామా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదానీ శనివారం అన్నారు. ప్రస్తుత హిందూత్వ రూపం భారతదేశ స్ఫూర్తికి విరుద్ధమని మదానీ పేర్కొన్నారు.

    దిల్లీలోని రామ్ లీలా మైదానంలో శుక్రవారం ప్రారంభమైన జమియాత్ 34వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

    ప్రపంచంలోనే ఇస్లాం అతి ప్రాచీనమైనదన్నారు. ఇస్లాం బయటి నుంచి వచ్చిందని చెప్పడం సరికాదన్నారు. భారతదేశం ముస్లింలకు మొదటి మాతృభూమి అని స్పష్టం చేశారు.

    ఈ దేశంపై ప్రధాని మోదీ , ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌కు ఎంత హక్కు ఉందో, తనకు కూడా అంతే ఉందని మదానీ స్పష్టం చేశారు.

    జమియత్

    పస్మండ ముస్లింలు వివక్షకు గురవుతున్నారు: మహమూద్ మదానీ

    పస్మండ ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారి రిజర్వేషన్ కోసం జమియత్ ఉలామా-ఇ-హింద్ పోరాడుతుందని మహమూద్ మదానీ చెప్పారు. పస్మండ ముస్లింల ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, అయితే ఈ దిశగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

    పస్మండ ముస్లింలకు రిజర్వేషన్ అవసరమని, అయితే కులాల ప్రాతిపదికన జరుగుతున్న అన్యాయానికి చింతిస్తున్నామన్నారు. ప్రతి ముస్లిం సమానమే అని, కుల వివక్షను ఇస్లాంలో అంగీకరించరని మహమూద్ మదానీ వివరించారు.

    భారీ భూకంపాలతో అల్లాడిపోతున్న టర్కీని ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మహమూద్ మదానీ కృతజ్ఞతలు తెలిపారు.

    పాలస్తీనా, ఇజ్రాయెల్‌ విషయంలో భారత విదేశాంగ విధానం దీర్ఘకాలికంగా దేశానికి లాభదాయకం కాదన్నారు మదానీ. ఇది స్వల్ప ప్రయోజనాలను తీసుకురావచ్చు, కానీ దీర్ఘకాలికంగా సరైనది కాదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    భారతదేశం
    దిల్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? నరేంద్ర మోదీ
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు విమానం

    భారతదేశం

    ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్ రైల్వే శాఖ మంత్రి
    భారతదేశంలో Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల: సత్తాచాటిన అబ్బాయిలు, 20మందికి 100 పర్సంటైల్ భారతదేశం
    ఫిబ్రవరి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025