NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్
    'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్
    భారతదేశం

    'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్

    వ్రాసిన వారు Naveen Stalin
    February 11, 2023 | 03:50 pm 1 నిమి చదవండి
    'దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది' జమియత్ చీఫ్ సంచలన కామెంట్స్
    దేశంపై మోదీకి ఎంత హక్కు ఉందో, నాకూ అంతే ఉంది: జమియత్ చీఫ్

    బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ముస్లింలు వ్యతిరేకం కాదని, అయితే వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు కొనసాగుతున్నాయని జమియత్ ఉలామా-ఇ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదానీ శనివారం అన్నారు. ప్రస్తుత హిందూత్వ రూపం భారతదేశ స్ఫూర్తికి విరుద్ధమని మదానీ పేర్కొన్నారు. దిల్లీలోని రామ్ లీలా మైదానంలో శుక్రవారం ప్రారంభమైన జమియాత్ 34వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే ఇస్లాం అతి ప్రాచీనమైనదన్నారు. ఇస్లాం బయటి నుంచి వచ్చిందని చెప్పడం సరికాదన్నారు. భారతదేశం ముస్లింలకు మొదటి మాతృభూమి అని స్పష్టం చేశారు. ఈ దేశంపై ప్రధాని మోదీ , ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్‌కు ఎంత హక్కు ఉందో, తనకు కూడా అంతే ఉందని మదానీ స్పష్టం చేశారు.

    పస్మండ ముస్లింలు వివక్షకు గురవుతున్నారు: మహమూద్ మదానీ

    పస్మండ ముస్లింలు వివక్షకు గురవుతున్నారని, వారి రిజర్వేషన్ కోసం జమియత్ ఉలామా-ఇ-హింద్ పోరాడుతుందని మహమూద్ మదానీ చెప్పారు. పస్మండ ముస్లింల ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, అయితే ఈ దిశగా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పస్మండ ముస్లింలకు రిజర్వేషన్ అవసరమని, అయితే కులాల ప్రాతిపదికన జరుగుతున్న అన్యాయానికి చింతిస్తున్నామన్నారు. ప్రతి ముస్లిం సమానమే అని, కుల వివక్షను ఇస్లాంలో అంగీకరించరని మహమూద్ మదానీ వివరించారు. భారీ భూకంపాలతో అల్లాడిపోతున్న టర్కీని ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మహమూద్ మదానీ కృతజ్ఞతలు తెలిపారు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ విషయంలో భారత విదేశాంగ విధానం దీర్ఘకాలికంగా దేశానికి లాభదాయకం కాదన్నారు మదానీ. ఇది స్వల్ప ప్రయోజనాలను తీసుకురావచ్చు, కానీ దీర్ఘకాలికంగా సరైనది కాదన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    బీజేపీ
    భారతదేశం
    దిల్లీ

    బీజేపీ

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన లక్నో
    'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్ లోక్‌సభ
    ప్రధాని మోదీని అగౌరవ పరిచేలా మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేపీ రాహుల్ గాంధీ
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ నితిన్ గడ్కరీ

    భారతదేశం

    ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ విమానం
    ఫిబ్రవరి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు భూకంపం
    భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్ టిక్ టాక్

    దిల్లీ

    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    ఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్ ఆంధ్రప్రదేశ్
    అఫ్ఘానిస్థాన్, పాలస్తీనా కంటే అధ్వానంగా కశ్మీర్: ముఫ్తీ జమ్ముకశ్మీర్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023