Assam:అస్సాంలో కూలిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం ఇటీవల గల్లంతైన విషయం తెలిసిందే. ఆ విమానం కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదం అస్సాం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ యుద్ధవిమానం అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. అదే సమయంలో రాడార్తో ఉన్న సంబంధాలు కూడా తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.అనంతరం జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి సుమారు 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయినట్లు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జోర్హాట్ నుంచి బయలుదేరిన యుద్ధవిమానం విషాదాంతం
STORY | SU-30 MKI aircraft of IAF crashes in Assam's Karbi Anglong
— Press Trust of India (@PTI_News) March 6, 2026
A Su-30 MKI fighter jet of the Indian Air Force (IAF) crashed in Assam's Karbi Anglong district on Thursday. The IAF said the search operation for the aircraft is underway. There is no information on the pilots… pic.twitter.com/8u7EK6TIEE