LOADING...
Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. రాత్రి 7 నుంచి హైవేలపై భారీ వాహనాలకు ఆంక్షలు
మొంథా తుపాను ప్రభావం.. రాత్రి 7 నుంచి హైవేలపై భారీ వాహనాలకు ఆంక్షలు

Cyclone Montha: మొంథా తుపాను ప్రభావం.. రాత్రి 7 నుంచి హైవేలపై భారీ వాహనాలకు ఆంక్షలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర తుపాను 'మొంథా' (Cyclone Montha) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. తుపాను ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. విపత్తు నిర్వాహకులు ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ అత్యవసర పరిస్థితులు తప్పితే బయటకు వెళ్లవద్దని, ప్రయాణాలను నివారించాల‌ని హెచ్చరించారు.

Details

గంటకు 15 కిలోమీటర్ల వేగం

భారీ వాహనాలను ముందుగానే సురక్షిత ప్రదేశాల్లో నిలిపివేయాలని డ్రైవర్లను కోరారు. ఇక తుపాను పురోగతిపై వివరాలు తెలియజేస్తూ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ చెప్పారు. 'పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను గత ఆరు గంటల్లో సుమారు గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందన్నారు. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి 60 కి.మీ, కాకినాడకు 140 కి.మీ, విశాఖపట్నానికి 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని ఆయన వివరించారు.