NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం 
    తదుపరి వార్తా కథనం
    Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం 
    Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం

    Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం 

    వ్రాసిన వారు Stalin
    Jan 15, 2024
    11:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీతో పాటు ఉత్తర భారతంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.

    దిల్లీని పొగమంచు కమ్మేయడంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 100కి పైగా విమానాల సమయాన్ని రీషెడ్యూల్ చేశారు.

    సోమవారం ఉదయం దిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఆవరించి.. దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది.

    తెల్లవారుజామున 3 గంటలకు దిల్లీ విమానాశ్రయంలో దృశ్యమానత సున్నా ఉండగా.. ఉదయం 5.30 గంటలకు కాస్త మెరుగుపడింది.

    దట్టమైన పొగమంచు కారణంగా దిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

     దిల్లీ

    అత్యంత చల్లని ఉదయంగా రికార్డు

    దిల్లీలో సోమవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రత 3.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినందున ఈ సీజన్‌లో ఇదే అత్యంత చల్లని ఉదయంగా నమోదైంది.

    లోధి రోడ్ ప్రాంతంలో కనిష్టంగా 3.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

    తీవ్రమైన పొగమంచు కారణంగా.. దిల్లీ విమానాశ్రయ వర్గాలు ప్రయాణీకులకు కీలక సూచనలు చేశారు.

    ప్రయాణికులు బయలుదేరే ముందు.. తమ విమానయాన సంస్థలను సంప్రదించవలసిందిగా కోరారు.

    అసౌకర్యానికి చింతిస్తున్నామని, పొగమంచు కారణంగా విమానాలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

    పంజాబ్, హర్యానా, చండీగఢ్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3-7 డిగ్రీల సెల్సియస్‌లో నమోదవుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    తాజా వార్తలు
    విమానాశ్రయం

    తాజా

    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్

    దిల్లీ

    Delhi air quality: దిల్లీలో వర్షం తర్వాత.. కాస్త మెరుగుపడిన గాలి నాణ్యత వాయు కాలుష్యం
    Air Pollution: దిల్లీలో దీపావళి కాలుష్యం.. గత 8 ఏళ్లలో ఈసారే ఉత్తమం, అయినా తీవ్రంగానే పొల్యూషన్  వాయు కాలుష్యం
    Delhi: సత్యేందర్ జైన్‌పై అక్రమార్జన ఆరోపణలపై విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతిని కోరిన సీబీఐ  భారతదేశం
    Deepavali In Delhi: దిల్లీలో పతనమైన గాలి నాణ్యత.. 'తీవ్రమైన' కేటగిరీ నమోదు  వాయు కాలుష్యం

    తాజా వార్తలు

    APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ
    Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు బెంగళూరు
    Congress: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం: కాంగ్రెస్ కాంగ్రెస్
    Sena vs Sena: షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ: మహారాష్ట్ర స్పీకర్  మహారాష్ట్ర

    విమానాశ్రయం

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025