NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం
    తదుపరి వార్తా కథనం
    ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం
    ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం

    ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభం, స్టాలిన్, సోరెన్, తేజస్వీకి ఆహ్వానం

    వ్రాసిన వారు Stalin
    Jan 24, 2023
    03:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజున అంటే ఫిబ్రవరి 17న కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు రూ. 700 కోట్లతో నిర్మించిన కొత్త ఐకానిక్ భవనాన్ని ఆ రోజు ఉదయం 11:30గంటలకు ప్రారంభించనున్నారు.

    కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీని వ్యతిరేకించే నేతలను ఆహ్వానించనున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా పలువురు నేతలు హాజరుకానున్నారు. అదే రోజు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ కూడ నిర్వహించే అవకాశం ఉంది.

    తెలంగాణ

    గోపురాలు, ఇంటీరియర్ పనులు మాత్రమే పెండింగ్

    వాస్తవాన్ని సచివాలయ భవనాన్ని సంక్రాంతి లేదా జనవరి నెలాఖరులోగా ప్రారంభించాలని కేసీఆర్ భావించారు. పనులు పూర్తి కాకపోవడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు.

    గోపురాలతో పాటు కొన్ని బ్లాకుల్లో పనులు ఉన్నట్లు నిర్మాణ పురోగతిపై సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. 10రోజుల్లో గోపురం పనులు పూర్తిచేసి.. ఏడు అంతస్తుల భవనంలోని అన్ని బ్లాకుల్లో ఇంటీరియర్ పనులు చేపడతారు. పనులు పూర్తయిన వెంటనే భవనాన్ని ఆర్అండ్‌బీ శాఖ జీఏడీ విభాగానికి అప్పగిస్తుంది.

    మంత్రులు, కార్యదర్శులకు కేటాయించాల్సిన కార్యాలయ గదులను జీఏడీ అధికారులు ఖరారు చేస్తారు. వాహనాల పార్కింగ్‌ జోన్ల పనులు పురోగతిలో ఉన్నాయని, అవి కార్యరూపం దాల్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చని ఆర్‌అండ్‌బీ మంత్రి వీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    హైదరాబాద్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    తెలంగాణ

    గోషామహల్ బస్తీలో కుంగిన పెద్ద నాలా.. దుకాణాలు, వాహనాలు అందులోకే.. భారతదేశం
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? చంద్రబాబు నాయుడు
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే కేసీఆర్‌ను జాతీయ స్థాయిలో నిలబెడతాయా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ భారతదేశం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    బీఆర్ఎస్ కిసాన్ సెల్‌ జిల్లా అధ్యక్షుల నియామకం వేగవంతం.. కేసీఆర్ ఫోకస్ భారతదేశం
    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభ.. ముగ్గురు సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం! ఖమ్మం
    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి

    హైదరాబాద్

    ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం టర్కీ
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు సికింద్రాబాద్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025