NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Income Tax Raids: త‌నిఖీల‌కు వెళ్లిన ఆదాయ‌ప‌న్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,న‌గ‌దుతో పాటు మొస‌ళ్లు 
    తదుపరి వార్తా కథనం
    Income Tax Raids: త‌నిఖీల‌కు వెళ్లిన ఆదాయ‌ప‌న్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,న‌గ‌దుతో పాటు మొస‌ళ్లు 
    త‌నిఖీల‌కు వెళ్లిన ఆదాయ‌ప‌న్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,న‌గ‌దుతో పాటు మొస‌ళ్లు

    Income Tax Raids: త‌నిఖీల‌కు వెళ్లిన ఆదాయ‌ప‌న్ను శాఖకు షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో బంగారం,న‌గ‌దుతో పాటు మొస‌ళ్లు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 10, 2025
    01:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే హరివంశ్ సింగ్ రాథోడ్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

    ఈ సోదాల సందర్భంగా అధికారులకు అవాక్కయ్యే అంశాలు బయటపడ్డాయి.

    బంగారం, కోట్ల నగదు, బినామీ కార్లతో పాటు ఇంట్లో మూడు మొసళ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు.

    రాథోడ్‌తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేష్ కేశర్వాని నివాసాల్లో కూడా ఆదివారం నుంచి ఐటీ శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి.

    దాదాపు ₹155 కోట్ల పన్ను ఎగవేశారని అనుమానం వ్యక్తమవుతోంది. రాథోడ్ ఇంట్లో నుంచి ₹3 కోట్ల నగదు, బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు, వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా.

    వివరాలు 

    బీడీ వ్యాపారం చేస్తున్న రాథోడ్, కేశర్వాని  

    రాథోడ్, కేశర్వాని ఇద్దరూ బీడీ వ్యాపారం చేస్తున్నారు. కేశర్వాని సుమారు ₹140 కోట్ల పన్ను ఎగవేశారని సమాచారం.

    దీనికి సంబంధించిన పత్రాలను ఐటీ సోదాల్లో గుర్తించారు. కేశర్వాని నిర్మాణ రంగ వ్యాపారంలో కూడా ఉన్నాడు.

    మరోవైపు, రాథోడ్ ఇంట్లో అధికారులను ఆశ్చర్యపరిచే అంశం మూడు మొసళ్లు.. ఇంట్లో ఉన్న ఒక చిన్న కుంటలో ఇవి ఉండటం గుర్తించారు. ఈ విషయం వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు.

    వివరాలు 

    2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా..

    కేశర్వాని ఇంట్లో పలు బినామీ దిగుమతి కార్లను గుర్తించారు. ఒక్క కారూ కూడా కేశర్వాని కుటుంబం పేరుతో రిజిస్టర్ కాలేదు.

    ట్రాన్స్‌పోర్ట్ శాఖ నుంచి కార్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ, వాటిని ఎలా కొనుగోలు చేశారనే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.

    సాగర్ జిల్లాలో రాథోడ్ తన వ్యాపారాన్ని ప్రారంభించి, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

    ఆయన జిల్లా చీఫ్ పోస్టుకు కూడా పోటీ చేశారు. రాథోడ్ తండ్రి హర్నమ్ సింగ్ రాథోడ్ గతంలో మధ్యప్రదేశ్ మంత్రిగా పనిచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    మధ్యప్రదేశ్

    Bhojshala Row: భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదుపై ఏఎస్ఐ సర్వే  భారతదేశం
    Madhyapradesh: మహాకాల్ ఆలయంలో ప్రమాదం.. ప్రధాన పూజారితో సహా 13 మందికి గాయాలు  భారతదేశం
    Madhya Pradesh: చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి,ఇద్దరికి గాయాలు  భారతదేశం
    Bhojshala Row: ధర్ భోజశాలలో తవ్వకాలపై సుప్రీంకోర్టు నిషేధం.. ASI సర్వే కొనసాగుతుంది భారతదేశం

    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఫైనాన్స్
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  కర్ణాటక
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025