LOADING...
India Thae Plan: భారత్‌లో చమురు ఉత్పత్తి పెరుగుదల.. థార్ ఎడారి కీలక పాత్ర
భారత్‌లో చమురు ఉత్పత్తి పెరుగుదల.. థార్ ఎడారి కీలక పాత్ర

India Thae Plan: భారత్‌లో చమురు ఉత్పత్తి పెరుగుదల.. థార్ ఎడారి కీలక పాత్ర

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2026
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ కోసం గందరగోళం నెలకొంది. మన దేశం పై అతి తక్షణ ప్రభావం లేనప్పటికీ, ఈ యుద్ధ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే భారతదేశంలో కూడా ఇంధన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ తన 'థార్' ప్రణాళికను అమలు చేసింది. థార్ ఎడారి ప్రాంతంలోని చమురు క్షేత్రాల నుంచి ముడి చమురు ఉత్పత్తిని భారీగా పెంచింది. ప్రస్తుతం జోధ్ పూర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి రోజుకు 1,202 బ్యారెల్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది.

వివరాలు

రాజస్థాన్ ఫీల్డ్ నుండి 43,773 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి

గడిచిన సంవత్సరం ఇదే ఫీల్డ్ నుంచి రోజుకు 705 బ్యారెల్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. అంటే ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఉత్పత్తి 70% పెరిగింది. ఆయిల్ ఇండియా, జైసల్మేర్‌లోని బఘేవాలా చమురు క్షేత్రం నుండి ముడి చమురును ట్యాంకర్ల ద్వారా గుజరాత్‌లోని ONGC ప్లాంట్లకు రవాణా చేస్తుంది. అక్కడి నుండి పైప్‌లైన్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కోయాలి రిఫైనరీకి పంపిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ ఇండియా తన రాజస్థాన్ ఫీల్డ్ నుండి 43,773 మెట్రిక్ టన్నుల ముడి చమురును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది ఇది 32,787 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నది.

వివరాలు

థార్ ఎడారి చమురు క్షేత్రం విశేషాలివే 

1991లో బికనేర్-నాగౌర్ సబ్ బేసిన్‌లోని బఘేవాలా చమురు క్షేత్రం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతం 200.26 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉంది. మొత్తం 52 బావులు ఉన్నాయి. వాటిలో 33 ప్రస్తుతం ఉత్పత్తిలో ఉన్నాయి. ఆయిల్ ఇండియా 19 బావులలో CSA (Cyclic Steam Stimulation) కార్యకలాపాలను పూర్తి చేసింది. ఇది గతేడాది పోలిస్తే 72% పెరుగుదల. 2018లో ఈ క్షేత్రంలో CSA టెక్నాలజీని ప్రారంభించి, భారీ స్థాయిలో చమురు వెలికితీసే అవకాశాన్ని పెంచింది. థార్ ఎడారి ఈ సమయంలో భారత్‌కు క్లీవ్ మూల ఇంధన వనరుగా మారింది. యుద్ధ పరిస్థితులు, హార్ముజ్ మూతపాటు వంటి సవాళ్లను ఎదుర్కొంటూ, దేశానికి స్వంత ముడి చమురు సరఫరా అత్యంత కీలకంగా మారింది.

Advertisement