NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం
    తదుపరి వార్తా కథనం
    Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం
    Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం

    Zambia: కలరాతో 600మంది మృతి.. భారత్ మానవతా సాయం

    వ్రాసిన వారు Stalin
    Feb 06, 2024
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కలరా మహమ్మారిని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.

    కలరాతో ఆ దేశంలో ఇప్పటి వరకు 600 మంది చనిపోయారు. అంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

    జాంబియా చరిత్రలో ఇదే అత్యంత దారుణమైన ఆరోగ్య సంక్షోభం కావడం గమనార్హం.

    అక్టోబర్ 2023 నుంచి ఇప్పటి వరకు దేశంలో 15,000 మందికి పైగా కలరా సోకింది. జాంబియాలోని 10 ప్రావిన్సులు ఉంటే, తొమ్మిదింటిలో కలరా కేసులు నమోదు కావడం గమనార్హం.

    ఈ క్రమంలో బాధితులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం స్డేడియాల్లో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాట చేసింది.

    కలరా

    జాంబియాకు అండగా నిలిచిన భారత్

    ఈ కష్ట కాలంలో జాంబియా దేశానికి భారత్ అండగా నిలిచింది. జాంబియాకు మానవతా సాయాన్ని పంపింది.

    సుమారు 3.5 టన్నుల బరువున్న ఈ సాయంలో నీటి శుద్దీకరణ సామాగ్రి, క్లోరిన్ మాత్రలు, ORS సాచెట్ల ఉన్నాయి.

    ఇదిలా ఉంటే, కలరాను అరికట్టేందుకు ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.

    జాంబియాలోని బాధిత వర్గాలకు అధికారులు రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు.

    దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఈ దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశంలోని రిటైర్డ్ ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    మానవత్వం
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భారతదేశం

    MM Naravane: 'ఆ రోజు రాత్రి రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చారు'.. ఆత్మకథలో గల్వాన్ ఘటనను వివరించిన నరవాణే చైనా
    IMF: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.3శాతం.. ఐఎంఎఫ్ అంచనా  ఐఎంఎఫ్
    కరోనా JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? WHO ఏం చెప్పింది?  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    Kisan Diwas 2023: నేడు రైతు దినోత్సవం.. ఏ ప్రధాని జయంతి రోజున జరుపుకుంటారు? తాజా వార్తలు

    మానవత్వం

    రాశి ఫలాలు: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. ఈ రాశుల వారికి పెళ్ళిళ్ళు లైఫ్-స్టైల్
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం
    అగ్నిపర్వతాలు బద్దలై డైనోసర్ జాతి అంతరించినా బొద్దింకలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. ఎలాగో తెలుసా? గ్రహం
    India humanitarian aid: గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్  భారతదేశం

    తాజా వార్తలు

    Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్‌'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం  బడ్జెట్
    Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు  మధ్యంతర బడ్జెట్ 2024
    Israel Hamas War: గాజాలో 24 గంటల్లో 150 మంది పాలస్తీనియన్లు మృతి హమాస్
    #RC16: రామ్ చరణ్ సినిమాలో కొత్త వారికి అవకాశం.. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడంటే!  రామ్ చరణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025