
DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
ఈ వార్తాకథనం ఏంటి
రక్షణ, భద్రత రంగంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారీ విజయాన్ని సాధించింది.
మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికతతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి మొదటి విమాన పరీక్షను డీఆర్డీఏ విజయవంతంగా పరీక్షించింది.
ఈ మేరకు ఈ విజయానికి డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఇందులో 5400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించారు. క్షిపణి బరువు 20 శాతానికి పైగా తగ్గిందని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి.
క్షిపణి బరువు తగ్గడం ద్వారా అగ్ని-5 క్షిపణి పరిధి 7000 కి.మీలకు పెరిగింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఉన్న అబ్దుల్ కలాం టెస్ట్ సెంటర్లో ఈ పరీక్ష జరిగింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రధాని మోదీ ట్వీట్
Proud of our DRDO scientists for Mission Divyastra, the first flight test of indigenously developed Agni-5 missile with Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) technology.
— Narendra Modi (@narendramodi) March 11, 2024