NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: బీహార్‌ వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి దారుణ హత్య 
    తదుపరి వార్తా కథనం
    Bihar: బీహార్‌ వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి దారుణ హత్య 
    బీహార్‌ వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి దారుణ హత్య

    Bihar: బీహార్‌ వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి దారుణ హత్య 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jul 16, 2024
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) పార్టీ అధినేత, బిహార్ ప్రభుత్వ మాజీ మంత్రి ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురయ్యారు.

    పదునైన ఆయుధంతో ఇంట్లోనే దారుణంగా హత్య చేసినట్లు చెబుతున్నారు. అయన మృతదేహం ఛిద్రమైన స్థితిలో కనిపించింది.

    దర్భంగా ఎస్‌ఎస్పీ జగనాథ్ రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు. జితన్ సాహ్ని మృతదేహాన్ని ఇంటి నుండి ఛిద్రమైన స్థితిలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

    పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. జితన్ సాహ్ని ఇల్లు దర్భంగాలోని సుపాల్ బజార్‌లోని అఫ్జ్లా పంచాయితీలో ఉంది.

    వివరాలు 

    హత్యపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటు

    నివేదిక ప్రకారం, జితన్ సాహ్నిని పదునైన ఆయుధంతో ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు.

    మృతదేహం కనిపించిన గది చుట్టూ రక్తం కారుతోంది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

    మొత్తం వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. హత్యపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు.

    ఎస్పీ దేహత్ (దర్భంగా) నేతృత్వంలో సిట్ కేసును దర్యాప్తు చేస్తుంది. ఎస్పీ దేహత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం దీనిపై విచారణ చేపట్టనుంది.

    ముఖేష్ సాహ్ని ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. తండ్రి హత్య వార్త తెలియగానే ముంబై నుంచి పాట్నా బయలుదేరారు.

    వివరాలు 

    దొంగతనం కోణం బయటపడింది! 

    ముఖేష్ సాహ్ని పూర్వీకుల ఇల్లు దర్భంగాలోని సుపాల్ మార్కెట్‌లో ఉంది.ఈ ఇంట్లో అతని తండ్రి జీతన్ ఒంటరిగా ఉండేవాడు.

    ముఖేష్ సాహ్ని తల్లి చాలా కాలం క్రితం మరణించింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రాత్రి కొందరు వ్యక్తులు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో జితన్ సాహ్ని ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

    దీనిపై జీతన్‌ నిరసన తెలపడంతో దుండగులు అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు.

    మాజీ మంత్రి ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురైనట్లు తెల్లవారుజామున సమాచారం అందిందని బిరౌల్ SDPO మనీష్ చంద్ర చౌదరి చెప్పారు.

    ఘటనా స్థలాన్ని పరిశీలించగా,ఎవరో దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ దాడిలో జీతన్ సహాని మరణించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    హత్య

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    బిహార్

    Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం  తాజా వార్తలు
    Nitish Kumar: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్‌కు లేఖ అందజేత నితీష్ కుమార్
    Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్ నితీష్ కుమార్
    Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్‌ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్  జనతాదళ్ (యునైటెడ్)

    హత్య

    Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే..  బిహార్
    Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త  ఉత్తర్‌ప్రదేశ్
    Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త  ఆంధ్రప్రదేశ్
    Three minors stab Delhi man: వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ముగ్గురు మైనర్లు.. ఆపై డెడ్‌బాడీకి నిప్పు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025