NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం 
    తదుపరి వార్తా కథనం
    power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం 
    power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

    power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం 

    వ్రాసిన వారు Stalin
    Dec 10, 2023
    02:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో విద్యుత్ వినియోగంలో 9% పెరుగుదల నమోదైంది.

    2023 ఏప్రిల్- నవంబర్ మధ్య విద్యుత్ వినియోగం 1,099.9 బిలియన్ యూనిట్ల(BU)కు చేరుకుంది.

    గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలపరిమితితో పోలిస్తే భారీగా పెరుగుదల నమోదైంది.

    విద్యుత్ వినియోగంలో ఈ పెరుగుదల దేశంలోని ఆర్థిక కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని సూచిస్తుందని నిపుణలు చెబుతున్నారు.

    2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగం 1,504.26 బీయూకు పెరిగింది. అంతకుముందు ఏడాది అంటే 2021-22లో 1,374.02 బీయూ మాత్రమే నమోదైంది.

    విద్యుత్

    విద్యుత్ వినియోగం ఎందుకు పెరిగిందంటే..

    విద్యుత్ వినియోగం ఏప్రిల్, మే, జూన్‌లో భారీగా పెరిగింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితుల వల్ల కూడా విద్యుత్ వినియోగం ఎక్కువైంది.

    పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడం మరో కారణం. వేసవిలో విద్యుత్ మంత్రిత్వ శాఖ గరిష్టంగా 229GW డిమాండ్‌ను అంచనా వేసినప్పటికీ, అకాల వర్షం కారణంగా జూన్‌లో 224.1GW, జూలైలో 209.03GW తగ్గింది.

    ఆగస్టు నుంచి డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదైంది. ఆగస్టులో గరిష్టంగా 238.82GW, సెప్టెంబర్‌లో 243.27GWకు వినియోగం పెరిగింది.

    2013-14 నుంచి 2022-23 వరకు ఇంధన పరంగా దేశంలో విద్యుత్ డిమాండ్ 50.8శాతం పెరిగిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ లోక్‌సభకు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యుత్
    భారతదేశం
    వినియోగం
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం వేసవి కాలం
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    భారతదేశం

    ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను అధ్యయనం చేస్తున్న భారత రక్షణ దళాలు రక్షణ
    కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ రహస్య భేటీ.. దౌత్య వివాదంపై చర్చలు!  సుబ్రమణ్యం జైశంకర్
    Helpline: గాజాలోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ప్రారంభం  పాలస్తీనా

    వినియోగం

    గూగుల్ పే వినియోగదారుల ఖాతాలోకి రూ.88వేలు జమ; మీరూ చెక్ చేసుకోండి గూగుల్
    తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్; ఒక్కరోజే 11,241 మెగావాట్ల వినియోగం తెలంగాణ

    తాజా వార్తలు

    Bitcoin: 40,000 డాలర్ల మార్కును బిట్‌కాయిన్ విలువ.. ఇన్వెస్టర్లలో ఆనందం  క్రిప్టో కరెన్సీ
    Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి మణిపూర్
    Padi Kaushik Reddy: హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు హుజురాబాద్
    Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025