NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Priyanka Gandhi: బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణకు భారత్ చర్చలు జరపాలి.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ
    తదుపరి వార్తా కథనం
    Priyanka Gandhi: బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణకు భారత్ చర్చలు జరపాలి.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ
    బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణకు భారత్ చర్చలు జరపాలి.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ

    Priyanka Gandhi: బంగ్లాదేశ్ మైనారిటీల రక్షణకు భారత్ చర్చలు జరపాలి.. లోక్‌సభలో ప్రియాంక గాంధీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 16, 2024
    02:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది.

    ఈ సమస్యపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు.

    బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్‌లపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం గళం విప్పాలని కోరింది.

    పరిస్థితిని చక్కదిద్దేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆమె పేర్కొన్నారు.

    ప్రియాంక గాంధీ, విజయ దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరులకు సెల్యూట్ చేస్తూ, అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.

    Details

     ప్రియాంక గాంధీ బ్యాగ్ పై 'పాలస్తీనా'

    తూర్పు పాకిస్థాన్‌ను (ప్రస్తుత బంగ్లాదేశ్) స్వతంత్ర దేశంగా ప్రకటించడంలో ఇందిరాగాంధీ చరిత్రాత్మక పాత్రను ఆమె ప్రశంసించారు.

    ఇక ప్రియాంక గాంధీ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దానిపై 'పాలస్తీనా' అని ఇంగ్లీష్‌లో రాసి ఉండడం విశేషం.

    ఈ బ్యాగ్ ద్వారా ప్రియాంక ఇజ్రాయెల్ దాడులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాలస్తీనా ప్రజల పట్ల సంఘీభావం ప్రకటించారని విశ్లేషకులు అంటున్నారు.

    బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు విస్తృతంగా పెరిగిపోతున్నాయి.

    మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిన తర్వాత ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు మరింత చర్చకు దారి తీసింది.

    Details

    మైనార్టీల రక్షణకు తగిన చర్యలు

    ఈ అరెస్టు మైనారిటీలపై దాడులకు మరో ఉదాహరణగా నిలిచింది. ఆయనకు న్యాయసాయం అందించడంపై కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

    ఇందుకు సంబంధించి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

    మరోవైపు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి అక్కడి నాయకులతో చర్చలు జరిపారు.

    బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య మల్టీ లెవల్ చర్చలు కొనసాగుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రియాంక గాంధీ
    బంగ్లాదేశ్

    తాజా

    Saraswati Pushkaralu: కాళేశ్వరం అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు: రేవంత్ రెడ్డి  తెలంగాణ
    S Jaishankar: చరిత్రలో మొదటిసారి.. తాలిబన్‌ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు  భారతదేశం
    Andhra News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా.. మార్గదర్శకాలు విడుదల ఆంధ్రప్రదేశ్
    Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి జీవనశైలి

    ప్రియాంక గాంధీ

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  నరేంద్ర మోదీ
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  కాంగ్రెస్
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ హైదరాబాద్
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక

    బంగ్లాదేశ్

    'Highly deplorable': "బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని తలకిందులుగా వేలాడదీసి".. అమిత్ షా వ్యాఖ్యలకు బాంగ్లాదేశ్ అభ్యంతరం అమిత్ షా
    Muhammad Yunus:షేక్ హసీనాను  దించేయడం పథకం ప్రకారం జరిగింది, సూత్రధారి పేరు వెల్లడించిన మహ్మద్ యూనస్ అంతర్జాతీయం
    BCB: ఆఖరి టెస్టుకు షకిబ్ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చీఫ్‌ ఫరూఖీ షకీబ్ అల్ హసన్
    IND vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. టాస్‌ నెగ్గిన భారత్‌  టీమిండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025