NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Canada:నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం.. భారతదేశం తీవ్రంగా ఖండించిన భారత్‌ 
    తదుపరి వార్తా కథనం
    India-Canada:నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం.. భారతదేశం తీవ్రంగా ఖండించిన భారత్‌ 
    నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం

    India-Canada:నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం.. భారతదేశం తీవ్రంగా ఖండించిన భారత్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 21, 2024
    09:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య అనంతరం భారత్‌-కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

    తాజాగా, ఈ ఉదంతంపై కెనడా మీడియా సంచలన కథనం ప్రచురించడం మరింత దుమారం రేపింది.

    ముఖ్యంగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో, ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

    అవాస్తవ కథనాలను పూర్తిగా కొట్టిపారేస్తున్నామని స్పష్టంచేసింది.

    వివరాలు 

    నరేంద్రమోదీ పేరు ప్రస్తావన 

    కెనడా దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక 'ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌' ఇటీవల నిజ్జర్‌ హత్య కేసు గురించి ఓ కథనాన్ని ప్రచురించింది.

    అందులో, భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖను ఈ కుట్రలో భాగస్వాములుగా చూపించేందుకు ప్రయత్నించారని పేర్కొంది.

    అంతేకాక, భారత ప్రధాని నరేంద్రమోదీ పేరును కూడా ప్రస్తావించి మరింత చిచ్చు పెట్టే విధంగా వ్యవహరించింది.

    ఈ కథనంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ, ''సాధారణంగా మేం వార్తా కథనాలపై స్పందించబోం.అయితే, కెనడా ప్రభుత్వ వర్గాలకనుసంధానంగా వచ్చిన ఈ అవాస్తవ కథనాలను ఖండిస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాలు భారత్‌-కెనడా సంబంధాలను మరింత దిగజారుస్తాయి''అని తెలిపారు.

    వివరాలు 

    ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యం 

    గతేడాది, ఖలిస్థానీ అనుకూలవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రభుత్వానికి సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో భారత్‌-కెనడా దౌత్య సంబంధాలు తీవ్ర మలుపు తిన్నాయి.

    అంతేకాక, నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును చేర్చడంతో పరిస్థితి మరింత జటిలమైంది.

    ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం తమ దేశంలోని కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

    వివరాలు 

    భారత గట్టిపట్టుకు కెనడా 

    ఈ పరిణామాల కారణంగా కెనడా ప్రభుత్వం పై చర్యలు కొనసాగిస్తుండగా, భారత్‌ కూడా తగిన రీతిలో ప్రతిస్పందిస్తోంది.

    ఈ ఉదంతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత దెబ్బతీయడంతోపాటు, భవిష్యత్‌ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కెనడా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కెనడా

    Hardeep Singh Nijjar: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నాలుగో నిందితుడి అరెస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్
    canada: కెనడాలో 16మంది మృతికి కారణమైన భారత సంతతి ట్రక్ డ్రైవర్ బహిష్కరణ  అంతర్జాతీయం
    Canada: కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ హతం అంతర్జాతీయం
    Canada: భారతదేశాన్ని రెండవ అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొన్న కెనడా  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025