English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sri Lankan Navy: శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sri Lankan Navy: శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ
    శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు

    Sri Lankan Navy: శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 28, 2025
    05:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత దేశానికి చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ జరిపిన కాల్పులపై విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది.

    ఈ ఘటనలో ఐదుగురు మత్స్యకారులు గాయపడినట్లు తెలిసింది.

    ఈ విషయంపై న్యూఢిల్లీలోని శ్రీలంక యాక్టింగ్ హైకమిషనర్‌కు భారత ప్రభుత్వం మంగళవారంనాడు సమన్లు పంపి, తీవ్ర నిరసనను తెలియజేసింది.

    శ్రీలంక తీరంలోని డెల్ఫ్ట్ (Delft) ఐలాండ్ సమీపంలోని ప్రాంతానికి వెళ్లిన 13 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం మంగళవారం తెల్లవారుజామున అడ్డుకుంది.

    వారిని పట్టుకోవడంలో కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో ఉన్నారు.

    వివరాలు 

    ముగ్గురు స్వల్ప గాయాలతో చికిత్స

    ఈ వివరాలను, భారత్ తీసుకున్న చర్యలను ఎంఈఏ ఒక ప్రకటనలో వెల్లడించింది.

    భారత విదేశాంగ శాఖ, న్యూఢిల్లీ లోని శ్రీలంక హైకమిషనర్‌ను ఈ ఉదయం పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

    పట్టబడిన మత్స్యకారులలో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో జాఫ్నా టీచింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ముగ్గురు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారని తెలియజేసింది.

    ఇక, జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు కూడా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన మత్స్యకారులను పరామర్శించారు.

    వారికి, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    మత్స్యకారులు తమిళనాడు, కారైకాల్ ప్రాంతాలకు చెందినవారు

    ఈ విషయం కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ కూడా శ్రీలంక విదేశాంగ శాఖకు తెలియజేసింది.

    "ఎలాంటి పరిస్థితుల్లోనూ బలప్రయోగం (use of force) చేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఉన్న అవగాహనకు తగిన విధంగా తప్పక పాటించాలి" అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

    ఈ 13 మంది మత్స్యకారులు తమిళనాడు, కారైకాల్ ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విదేశాంగశాఖ

    తాజా

    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ
    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్
    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం

    విదేశాంగశాఖ

    MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ భారతదేశం
    Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌ ఇస్కాన్
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత  క్రీడలు
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్ కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025