
భారతీయ శాస్త్రవేత్త స్వాతికి ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ అవార్డు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్కు ప్రతిష్టాత్మకమైన నార్మన్ బోర్లాగ్ అవార్డు-2023 వరించింది.
వ్వవసాయంలో క్షేత్ర పరిశోధన, అన్వయ అంశాలపై చేసిన కృషికిగానూ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (IRRI)కు చెందిన స్వాతి, అద్వితీయ యువశాస్త్రవేత్తని వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రశంసించింది.
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ నిధులతో నడిచే ఈ సంస్థ, వరి సాగుచేసే చిన్నకారు రైతులకు అందించిన సేవలకుగానూ ఈ పురస్కారం ప్రకటించినట్లు వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ వెల్లడించింది.
ఆకలి నిర్మూలన, ఆహార భద్రత పురోగతికి సహకరించే యువశాస్త్రవేత్తలకు హరిత విప్లవ పితామహుడు,నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్ అవార్డును అందిస్తారు.
ఒడిశాకు చెందిన స్వాతి, దిల్లీ ఐఆర్ఆర్ఐలో విత్తన పరిశోధన విభాగాధిపతిగా కొనసాగుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రైతుల పొలాల్లో వ్యవసాయ విస్తరణ,సాంకేతిక బదిలీ ఛాంపియన్ స్వాతి
Congratulations Dr. Swati Nayak the 2023 @WorldFoodPrize’s #BFA23 Recipient. A champion of inclusive agricultural extension & technology transfer. We share the commitment of putting scientific advancements & tangible benefits on farmers' fields. Let's keep co-creating a better 🌐 https://t.co/nImEUFFhWw pic.twitter.com/d9sysSZdUd
— Bram Govaerts CIMMYT (@bramaccimmyt) September 20, 2023