NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!
    తదుపరి వార్తా కథనం
    Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!
    ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!

    Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 07, 2025
    02:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది.

    ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ 32ఏళ్ల మహిళపై నర్సింగ్‌ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

    పోలీసుల వివరాల ప్రకారం... బాధితురాలు ఐసీయూలో ఉండగా, ఆమె కుటుంబ సభ్యులు గదికి వెలుపలే వేచి ఉన్నారు.

    ఇదే సమయంలో నర్సింగ్‌ సిబ్బంది ఒకరు ఆమె బెడ్ చుట్టూ కర్టెన్‌లు వేసి మత్తు మందు ఇచ్చాడు. స్పృహలో సగం ఉన్న బాధితురాలు సాయం కోరేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు

    స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆమె భర్త ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగా, వారు తొలుత ఈ ఆరోపణలను ఖండించారు.

    కానీ బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

    అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

    ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆస్పత్రి అధికారి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం! రాజస్థాన్
    Vijay: విజయ్ రాజకీయ యాత్రకు శ్రీకారం.. రెండో వారంలో ప్రజల్లోకి! విజయ్
    Infosys: ఇన్ఫోసిస్‌కు భారీ ఊరట.. రూ.32,403 కోట్ల జీఎస్‌టీ నోటీసుపై డీజీజీఐ క్లిన్‌చిట్! ఇన్ఫోసిస్
    AA22xA6 movie: అల్లు అర్జున్ సినిమాలో దీపిక పదుకోనే.. అట్లీ స్ట్రాటజీ అదిరింది! అల్లు అర్జున్

    రాజస్థాన్

    Kota Fire: కోట హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థుకు గాయలు  భారతదేశం
    Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి ఉత్తర్‌ప్రదేశ్
    PM Modi: 'కాంగ్రెస్‌ పాలనలో హనుమాన్‌ చాలీసా వినడం కూడా నేరమే...' కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని  నరేంద్ర మోదీ
    Gujarath-Pakistanis-arrested-Drugs:గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్థానీల అరెస్టు…రూ.602 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025