NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / లద్దాఖ్‌‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా
    భారతదేశం

    లద్దాఖ్‌‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా

    లద్దాఖ్‌‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా
    వ్రాసిన వారు Naveen Stalin
    Dec 23, 2022, 03:39 pm 1 నిమి చదవండి
    లద్దాఖ్‌‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా
    భారత్- చైనా కమాండర్ స్థాయి సమావేశంలో మధ్యంతర నిర్ణయాలు

    భారత్- చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరిగిన 17వ సమావేశంలో సరిహద్దు వివాద పరిష్కారానికి ఎలాంటి ముందడుగు పడలేదు. తూర్పు లద్దాఖ్‌లోని డెప్సాంగ్ ప్లెయిన్స్, చార్డింగ్ నింగ్‌లుంగ్ నుల్లా జంక్షన్‌లో భారత సైన్యానికి పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరించడానికి చైనా అంగీకరించకపోవడంతో.. కొన్ని తాత్కాలిక నిర్ణయాలు తీసుకొని సమావేశాన్ని ముగించారు. ఇరు దేశాల కమాండర్ల స్థాయి చర్చల్లో జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఒక సంయుక్త ప్రకటను విడుదల చేశారు. సైనిక, దౌత్య మార్గాల్లో నిరంతరం చర్చలు జరపాలని, ఇలా చేయడం వల్ల శాశ్వత పరిష్కారం కనుగొనే వీలవుతుందని ఇరు దేశాల సైనికాధికారులు నిర్ణయించారు.

    మళ్లీ నిరాశే మిగిలింది..

    అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో డిసెంబర్ 9న భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇది డిసెంబర్ 12న వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణను ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ఈ ఘర్షణలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. తవాంగ్ సెక్టార్‌లో జరిగిన ఘర్షణ తర్వాత జరిగిన ఇరు దేశాల సైనిక అధికారుల సమావేశం ఎదో ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపుతుందని అందరూ ఆశించారు. అయితే అలాంటిదేమీ జరగకుండా.. 16వ కమాండర్ల స్థాయి సమావేశం నిర్ణయాలకు కొనసాగింపుగా.. 17వ సమావేశం జరిగింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం

    తాజా

    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ

    భారతదేశం

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్ భారతదేశం
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023