NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు 
    'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు

    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 19, 2025
    03:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా పాల్గొన్నారు.

    అంతేకాదు గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా సందర్శించారు. ఈ పథకం మొత్తం రూ.12,600 కోట్లతో చేపట్టారు.

    దీనివల్ల గిరిజన రైతుల భూములకు సాగునీటి, సౌర విద్యుత్ సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం. రైతులకు సౌర విద్యుత్ ఏర్పాటు చేయడం వల్ల అదనపు విద్యుత్ ప్రభుత్వానికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.

    Details

    విద్యుత్ వినియోగంపై శిక్షణ ఇవ్వాలి

    అలాగే సౌర విద్యుత్ వినియోగంపై గిరిజనులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పథకం వివరాలను మీడియాకు వెల్లడించారు.

    ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద కేటాయించిన గిరిజన భూములన్నింటినీ సాగులోకి తీసుకురావడం, వారికి ఆర్థిక బలోపేతం చేయడం ఈ పథక లక్ష్యం. 2.10 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో 6 లక్షల ఎకరాల్లో సాగునీటి సౌకర్యాలు అందించాలని ప్రకటించారు.

    ఇందిర సౌర గిరి జల వికాసం కింద గ్రామాల్లో జల వనరుల కోసం జియోలాజికల్ సర్వేలు, సోలార్ పంపుసెట్లు, బోర్లు వేయడం, ప్లాంటేషన్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు.

    పథకం అమలులో ఐటీడీఏ ప్రాజెక్టు, ఉద్యాన శాఖ, విద్యుత్తు అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు.

    Details

    పథకంపై అవగాహన పెంచాలి

    సోలార్ పంపుసెట్లతో పాటు పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయించి రైతులకు అదనపు ఆదాయం కలగడం కోసం చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

    గిరిజన లబ్ధిదారులకు పథకంపై అవగాహన పెంచాలని సూచించారు.

    అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. రైతుల పొలాల్లో వంద రోజుల్లో సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

    సోలార్ విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పంపుసెట్ల స్థానంలో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

    ఈ విధంగా, అందరికీ సాగునీటి, సౌర విద్యుత్ సౌకర్యాలు అందించే ఇంత పెద్ద పథకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్రంలో గిరిజనుల ఆర్థిక ప్రగతికి శ్రీకారం చుట్టనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    కాంగ్రెస్
    తెలంగాణ

    తాజా

    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి

    రేవంత్ రెడ్డి

    Gummadi Narsaiah: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సీఎంను కలవాలని కోరినా అనుమతి లేదు ఇల్లెందు
    Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం తెలంగాణ
    SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు తెలంగాణ
    Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ తెలంగాణ

    కాంగ్రెస్

    Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కిషన్ రెడ్డి
    Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం రేవంత్ రెడ్డి
    Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై గువాహటిలో కేసు నమోదు రాహుల్ గాంధీ
    Congress: ఆరోగ్య శాఖలో రూ.382 కోట్లు అవినీతి.. అప్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తెలంగాణ

    Azharuddin: అజారుద్దీన్ పేరును తొలగించొద్దు.. హెచ్‌సీఏకి హైకోర్టు క్లారిటీ! హైకోర్టు
    Telangana SSC Results: పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి  భారతదేశం
    Bandi Sanjay: గ్రూప్‌-1 పై నివేదిక ఇవ్వండి.. టీజీపీఎస్సీకి బండి సంజయ్‌ లేఖ బండి సంజయ్
    Telangana: ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశ౦.. జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025