NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి! 
    వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!

    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 18, 2025
    03:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసిన హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    భారత్‌లో నివసిస్తూ శత్రు దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినందుకు ఆమెపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

    ప్రస్తుతం 5 రోజుల పోలీసు కస్టడీలో ఉన్న ఆమెపై విచారణ కొనసాగుతోంది.

    Details

     పాక్ ఎంబసీ 'ఇఫ్తార్' విందులో హాజరు

    దిల్లీలోని పాక్ ఎంబసీలో పనిచేస్తున్న డానిష్ అనే అధికారి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్న విషయాలు ఆమె యూట్యూబ్ వీడియోల ద్వారా బయటపడ్డాయి.

    విందు ఏర్పాట్లను ఆమె 'సూపర్‌గా, డూపర్‌గా' అంటూ కొనియాడినట్టు వీడియోల్లో ఉంది.

    ఈ సందర్భంగా పాక్ జాతీయ దినోత్సవం, పాక్ పర్యటనల గురించి ఆమె ఇతరులతో సంభాషించినట్లుగా పోలీసులు గుర్తించారు. "పాకిస్థాన్‌కి వెళ్లాలని ఉంది" అని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

    Details

    4కంటే ఎక్కువసార్లు పాక్ పర్యటనలు

    ఆధికారిక వర్గాల ప్రకారం, డానిష్ సహకారంతో జ్యోతి మల్హోత్రా పాక్‌కు కనీసం నాలుగు సార్లు పైగా వెళ్లింది.

    ఈ పర్యటనల వివరాలు ఆమె యూట్యూబ్‌ ఛానెల్‌ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    అందులో 'పాకిస్తాన్‌లో భారత అమ్మాయి', 'లాహోర్‌ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి', కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి, 'లగ్జరీ బస్సును నడిపిన భారత అమ్మాయి వంటి శీర్షికలతో వీడియోలు ఉన్నాయి.

    పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం నవాజ్‌ను కలిసిన వీడియో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో లభ్యమైంది

    Details

    నిఘా వర్గాలతో సంబంధాలు

    పోలీసుల విచారణలో ఆమె పాక్‌ నిఘా సంస్థల అధికారులతో టచ్‌లో ఉన్నట్లు తేలింది.

    వాట్సాప్‌, టెలిగ్రామ్‌, స్నాప్‌చాట్‌ వంటివి ఉపయోగించి భారత ఆర్మీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు వెల్లడించారు.

    ఆమె శ్రీనగర్ సహా వివిధ సున్నిత ప్రాంతాల్లో పర్యటించిన నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

    హర్యానాలో మరికొంతమంది అరెస్టు

    జ్యోతి మల్హోత్రాతో పాటు గూఢచర్య ఆరోపణలపై హర్యానాలో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఐఎస్‌ఐతో సంబంధాలు కలిగి శత్రు దేశానికి సమాచారం అందించినట్లు నమ్ముతున్నారు.

    వీరిని హరియాణాలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారు.

    Details

    ట్రావెల్ బ్లాగర్‌ నుంచి నిందితురాలిగా

    జ్యోతి మల్హోత్రా హరియాణాలోని హిసార్‌కు చెందిన ట్రావెల్ బ్లాగర్‌.

    దిల్లీలో నివసిస్తూ యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రాచుర్యం పొందిన ఆమెకు యూట్యూబ్‌లో 3.7 లక్షల సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

    ఆమె 2023లో పాకిస్థాన్ వెళ్లిన బృందంలో భాగమై అక్కడ డానిష్‌ను కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఇండోనేషియా కూడా ఆమె పర్యటించినట్లు అధికారులు తెలిపారు.

    Details

    డానిష్ సూచనతో భారత కాంటాక్టులతో టచ్

    భారతదేశానికి వచ్చిన తర్వాత డానిష్ సూచన మేరకు ఆమె 'అహ్వాన్‌' అనే వ్యక్తిని కలిశారు. అతడు పాక్‌ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులతో ఆమెను పరిచయం చేశాడు.

    ఇతరుల కంటపడకుండా ఉండేందుకు ఆమె తమ కాంటాక్టుల పేర్లను ఫోన్‌లో వేరే పేర్లతో సేవ్ చేసిందని అధికారులు తెలిపారు.

    అధికారిక గూఢచర్య ఆరోపణలు

    జ్యోతి మల్హోత్రా తీరుపై అధికారులు తీవ్రమైన ఆరా తీస్తున్నారు. ఆమె ఫోన్, ల్యాప్‌టాప్, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

    ఆమెపై 'ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్' కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న పాక్ ఎంబసీ అధికారి డానిష్‌ను భారత్‌ ఈ నెల 13న బహిష్కరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    పాకిస్థాన్

    తాజా

    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం
    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్

    హర్యానా

    NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు  సుప్రీంకోర్టు
    Explained: హర్యానా ఎన్నికల్లో 'బుల్డోజర్‌' హవా.. ప్రచారానికి కొత్త వ్యూహం ఇండియా
    Haryana Assembly Elections 2024: ఆప్‌కి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన నీలోఖేరి అభ్యర్థి  భారతదేశం
    Manu Bakar: యువతకు ఆదర్శంగా మను బాకర్.. హర్యానా ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన స్టార్ షూటర్  పోలింగ్

    పాకిస్థాన్

    Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్ భారతదేశం
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్
    khawaja asif: మన రక్షణ వ్యవస్థను భారత్ మట్టికరిపించింది: పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయం
    Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025