IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (Pilot Rohitreddy) ఇంట్లో దాడులు జరుగుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాతబస్తీలోలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కింగ్స్ ప్యాలెస్ యజమాని ఇల్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.