Loading...
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్య

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమే: అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు. కశ్మీర్‌కు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన తొలి అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ నిలిచారు. బుధవారం శ్రీనగర్‌లో ఆయన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సెర్గియో గోర్..జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటని అన్నారు. కశ్మీర్‌కు రావడం ఇదే తన మొదటి పర్యటన అని, ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉందని ప్రశంసించారు. ఇక్కడి భద్రతా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో అమెరికా పౌరుల కోసం అమల్లో ఉన్న ప్రయాణ హెచ్చరికలను సడలించే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

కశ్మీర్‌ను సందర్శించేందుకు పలువురు అమెరికా పౌరులు ఆసక్తి

కశ్మీర్‌ను సందర్శించేందుకు పలువురు అమెరికా పౌరులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

సెర్గియో గోర్ పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ భేటీ కానున్నారు.

ఆ తర్వాత గురువారం ఆయన లద్దాఖ్‌లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కశ్మీర్ అంశంపై తన వైఖరిని స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన సమస్యలను ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సిన అంతర్గత వ్యవహారాలుగా ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంలో వాషింగ్టన్‌ జోక్యం అవసరం లేదని, అందువల్ల అమెరికా రాయబారితో కశ్మీర్ సమస్యలపై తాను చర్చించబోనని ముందుగానే తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జమ్మూకశ్మీర్‌పై అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు.. 

ADVERTISEMENT