NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి
    భారతదేశం

    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి

    వ్రాసిన వారు Naveen Stalin
    April 13, 2023 | 12:19 pm 0 నిమి చదవండి
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి

    దేశంలో అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తన నివేదికలో పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల విలువ రూ.510 కోట్లుగా ఏడీఆర్‌ నివేదించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 30మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణస్వీకార పోల్ అఫిడవిట్‌లను విశ్లేషించిన తర్వాత ఈ నివేదికను తయారు చేసినట్లు ఏడీఆర్ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం రూ. 15లక్షలతో చివరి స్థానంలో నిలిచారు.

    అప్పుల్లో అగ్రస్థానంలో నిలిచిన సీఎం కేసీఆర్

    ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు అప్పుల్లో అగ్రస్థానంలో నిలిచినట్లు ఏడీఆర్ చెప్పింది. కేసీఆర్‌కు 8కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించింది. కేసీఆర్ మొత్తం ఆస్తుల విలువ రూ.23.55 కోట్లు అని నివేదిక పేర్కొంది. మొత్తం తొమ్మిది మంది ముఖ్యమంత్రులు తమ అప్పుల విలువ కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ అని ప్రకటించారు. మొత్తం 30మంది ముఖ్యమంత్రులలో 29మంది కోటీశ్వరులు కాగా, 13మంది సీఎంలు తమపై హత్యాయత్నం, కిడ్నాప్‌తో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. జగన్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.163 కోట్లుగా ఏడీఆర్ నివేదికలో తేలింది. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు రూ.63 కోట్ల ఆస్తులున్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్
    ముఖ్యమంత్రి
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ
    తాజా వార్తలు

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
    'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు తెలంగాణ
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
    టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    ముఖ్యమంత్రి

     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ  కర్ణాటక
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    ఈదురు గాలులకు కూలిన భారీ చెట్టు; ఏడుగురు మృతి మహారాష్ట్ర

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం తెలంగాణ
    'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి
    తెలంగాణ: నష్టపోయిన పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌; ఎకరాకు రూ.10వేల పరిహారం ముఖ్యమంత్రి

    తెలంగాణ

    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి: 132వ జయంతి రోజున 125అడుగుల విగ్రహం ఆవిష్కరణ  హైదరాబాద్
    తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు  కోవిడ్
    తెలంగాణలో పెరిగిన ఎండలు; రాబోయే ఐదు రోజులు పెరగనున్న ఉష్ణోగ్రతలు  వేసవి కాలం
    బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోరం: సిలిండర్ పేలుడుతో భారీ ప్రమాదం  తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్

    తాజా వార్తలు

    పంజాబ్‌: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి పంజాబ్
    దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!  కరోనా కొత్త కేసులు
    జపాన్ సమీపంలోని జలాల్లో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?  పంజాబ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023