Jammu and Kashmir: జమ్ములో ఘోర బస్సు ప్రమాదం..36మంది మృతి
కిష్త్వార్ నుండి జమ్ముకి వెళుతున్న బస్సు దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలోని ట్రుంగల్ సమీపంలో ఏటవాలుగా సుమారు 250 మీటర్ల దిగువకు పడిపోయింది. ఈ ప్రమాదంలో 36మంది మృతి చెందగా మరో 19మంది గాయపడ్డారు. దోడా జిల్లా మేజిస్ట్రేట్ ప్రకారం, అధికారులు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. జమ్ముకశ్మీర్ లోని దోడాలో బస్సు 300 అడుగుల లోయలో పడిపోయిందని జమ్ము డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ ధృవీకరించారు. JK02CN-6555 నంబరుతో 55 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు బటోట్-కిష్త్వార్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో రోడ్డుపై నుండి జారిపడి ఘోర ప్రమాదానికి దారితీసింది.