
PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ (NACIN ) కొత్త క్యాంపస్ను మోదీ ప్రారంభిస్తారు.
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలోని వీరభద్ర దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంకు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఆ తర్వాత నార్కోటిక్స్ కొత్త క్యాంపస్ను ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా మోదీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లోని 74వ, 75వ బ్యాచ్కి చెందిన ట్రైనీలు ఆఫీసర్లు, భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో ఇంటరాక్ట్ అవుతారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లేపాక్షి ఆలయంలో పూజలు చేయనున్న మోదీ
Prime Minister @narendramodi will be on a two day visit to #AndhraPradesh and #Kerala beginning today.
— All India Radio News (@airnewsalerts) January 16, 2024
PM Modi will inaugurate the new campus of National Academy of Customs, Indirect Taxes and Narcotics in Andhra Pradesh and interact with Officer Trainees of 74th and 75th batch… pic.twitter.com/KOpcFiZ4gR