NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా 
    తదుపరి వార్తా కథనం
    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా 
    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 31, 2023
    05:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓ, ఛైర్ పర్సన్ గా జయావర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినేట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.

    ఈ బాధ్యతలు చేపట్టనున్న మొట్టమొదటి మహిళా అధికారి జయావర్మనే కావడం విశేషం.

    ఇండియన్ రైల్వే మేనేజిమెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన జయావర్మ, ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

    సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆమె సీఈఓ బాధ్యతలను చేపట్టనున్నారు.

    ఇప్పటి వరకూ రైల్వే బోర్డు సీఈఓగా అనిల్ కుమార్ లాహోటి కొనసాగారు.

    Details

    రైల్వే సలహాదారుగా నాలుగేళ్ల పాటు పనిచేసిన జయావర్మ

    అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జయావర్మ 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు.

    అదే విధంగా ఉత్తర, ఆగ్నేయ, తూర్పు రైల్వే జోన్ లలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి మంచిపేరును సంపాదించారు.

    ఢాకాలోని భారత హై కమిషన్ లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్లపాటు పనిచేసిన అనుభవం అమెకు ఉంది. ఆ సమయంలోనే కోల్‌కతా నుంచి ఢాకాకు 'మైత్రీ ఎక్స్ ప్రెస్' ప్రారంభమైంది.

    ఆమె అక్టోబర్ 1న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె పదవి కాలం ముగిసే వరకు అదే రోజు తిరిగి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025