NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..
    తదుపరి వార్తా కథనం
    JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..
    JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ

    JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..

    వ్రాసిన వారు Stalin
    Dec 23, 2023
    03:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

    తాను పెడుతున్న పార్టీకి 'జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party)' పేరు పెట్టినట్లు పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు.

    వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేనలు పక్కనపెట్టిన ప్రత్యేక హోదాను తీసుకువస్తామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

    విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమని అన్నారు.

    ఏపీ

    రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం: లక్ష్మీనారాయణ 

    వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించాయని ఆరోపించారు.

    ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

    రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రయత్నించినా.. ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యాయని లక్ష్మీ నారాయణ గుర్తు చేశారు.

    ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు రాష్ట్రం మూడు అవకాశాలను కోల్పోయిందని అన్నారు.

    తమ పార్టీ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తుందన్నారు. లక్ష్మీ నారాయణ 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు.

    జనసేన టిక్కెట్‌పై విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    ఆంధ్రప్రదేశ్

    Ap Daikin AC : శ్రీసిటీలో డైకిన్‌ ఏసీ తయారీ పరిశ్రమ ప్రారంభం బిజినెస్
    AP Highcourt : ఎస్‌ఐ నియామకాలపై హైకోర్టు విచారణ.. అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని కోర్టు ఆదేశం' హైకోర్టు
    Breaking: ఆంధ్రప్రదేశ్ లో కుల గణన వాయిదా  భారతదేశం
    High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం  చంద్రబాబు నాయుడు

    తాజా వార్తలు

    INDIA bloc meet: 92మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. నేడు 'ఇండియా' కూటమి కీలక భేటీ ఇండియా
    Revanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం రేవంత్ రెడ్డి
    COVID 19 JN.1 Sub Variant: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్టాలకు కేంద్రం కీలక సలహాలు  కరోనా వేరియంట్
    Hyderabad: పాతబస్తీలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025