Page Loader
JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..
JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ

JD Lakshmi Narayana: కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ.. పేరు ఇదే..

వ్రాసిన వారు Stalin
Dec 23, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. తాను పెడుతున్న పార్టీకి 'జై భారత్ నేషనల్ పార్టీ (Jai Bharat National Party)' పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికే పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేనలు పక్కనపెట్టిన ప్రత్యేక హోదాను తీసుకువస్తామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన పార్టీ పేరును ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమని అన్నారు.

ఏపీ

రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాం: లక్ష్మీనారాయణ 

వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రయత్నించినా.. ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యాయని లక్ష్మీ నారాయణ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకు రాష్ట్రం మూడు అవకాశాలను కోల్పోయిందని అన్నారు. తమ పార్టీ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తుందన్నారు. లక్ష్మీ నారాయణ 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. జనసేన టిక్కెట్‌పై విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.