NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి!
    జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి!

    Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2025
    09:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ (ఐఐటీల్లో) బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

    మే 18న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను ఐఐటీ కాన్పుర్‌ సోమవారం అధికారికంగా ప్రకటించింది.

    విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టినతేదీ, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి, ఫలితాల లింక్‌ ద్వారా స్కోర్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా కామన్ ర్యాంక్ లిస్ట్, కేటగిరీ ర్యాంక్ లిస్ట్‌ను ఐఐటీలు విడుదల చేయనున్నాయి.

    పేపర్‌-1, పేపర్‌-2కు సంబంధించిన ఫైనల్ కీలు కూడా అధికారికంగా విడుదలయ్యాయి.

    Details

    ఈసారి సీట్లు పెరగనున్నాయ్

    జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 1.80 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం.

    ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు అంచనా.

    గతేడాది రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని కటాఫ్ మార్కుల ప్రకారం 48,248 మందికి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనే అర్హత లభించింది. వారు మాత్రమే ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశాన్ని పొందారు.

    2024-25 విద్యాసంవత్సరానికి 23 ఐఐటీలలో మొత్తం 17,760 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి మద్రాస్‌ ఐఐటీ సహా కొన్ని ఇతర ఐఐటీలు కొత్త కోర్సులు ప్రారంభించడంతో సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది.

    Details

    జూన్ 3 నుంచి జోసా-2025 కౌన్సెలింగ్ ప్రారంభం

    జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (JoSAA)-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది.

    దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీ కోసం ఈసారి మొత్తం ఆరు విడతల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

    ఇప్పటికే JoSAA అధికారిక వెబ్‌సైట్‌లో ఐఐటీ కాన్పుర్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అందుబాటులో ఉంచింది.

    గతేడాది ఐదు విడతల కౌన్సెలింగ్ జరిగిందిగా, ఈసారి ఆరు విడతలుగా నిర్వహించనున్నారు.

    Details

    మరిన్ని వివరాలివే

    జూన్ 3: రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫైలింగ్ ప్రారంభం

    జూన్ 9, 11: మాక్ సీట్ అలాట్‌మెంట్ 1 & 2

    జూన్ 12: ఛాయిస్ లాకింగ్

    జూన్ 14: మొదటి విడత సీట్ల కేటాయింపు

    జూన్ 21: రెండో విడత

    జూన్ 28: మూడో విడత

    జులై 4: నాలుగో విడత

    జులై 10: ఐదో విడత

    జులై 16: ఆరో విడత సీట్ల కేటాయింపులు జరగనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    తెలంగాణ

    తాజా

    Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి! భారతదేశం
    'Operation Spider Web': రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Dust storm: విపరీతమైన తుఫానుతో ల్యాండింగ్‌కు బ్రేక్.. గాలిలోనే విమానం చక్కర్లు!  దిల్లీ
    Bangladesh: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు బంగ్లాదేశ్

    భారతదేశం

    Dance of the Hillary Virus: అలర్ట్.. 'డాన్స్ ఆఫ్ ది హిల్లరీ' మాల్వేర్‌తో సైబర్ దాడికి పాక్ పన్నాగం! టెక్నాలజీ
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్ పాకిస్థాన్
    Accounts ban: భారత్ ఆదేశాలు నిరాకరించిన ఎక్స్.. @GlobalAffairs ఖాతా నిలిపివేత  భారతదేశం

    తెలంగాణ

    Telangana: అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతాం: సీతక్క  భారతదేశం
    Inter Supplementary : మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం.. ఈ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయొచ్చు భారతదేశం
    Pillalamarri Banyan Tree: నేడు పాలమూరుని సందర్శించనున్న ప్రపంచ అందగత్తెలు !  భారతదేశం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025