NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jharkhand : రీల్స్ పిచ్చితో 100 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి..యువకుడు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Jharkhand : రీల్స్ పిచ్చితో 100 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి..యువకుడు మృతి 
    రీల్స్ పిచ్చితో 100 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి

    Jharkhand : రీల్స్ పిచ్చితో 100 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి..యువకుడు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2024
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది.

    రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఓ యువకుడు 100 అడుగుల ఎత్తు నుంచి దూకి లోతైన నీటిలో మునిగి మృతి చెందాడు.

    సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌తో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.

    పోలీసులు మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృత దేహం వెలికి తీయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

    జిల్లాలోని జిరావబరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరమ్ పర్వతం సమీపంలో రాతి క్వారీ ఉంది. ఇక్కడ నీటి చెరువు ఉంది.

    Details 

    రీల్ తీస్తూ యువకుడు మృతి 

    తౌసిఫ్ అనే యువకుడు తన స్నేహితులతో స్నానం చేసేందుకు ఇక్కడికి వచ్చాడు.

    ఈ క్రమంలో దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి లోతైన నీటిలో దూకి నీటిలో మునిగిపోయాడు.

    ఈ ఘటనపై సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనీష్ పాండేకు సమాచారం అందించారు.

    స్థానిక డైవర్లు, తీవ్రంగా శ్రమించి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.

    విచారణలో యువకుడు తన స్నేహితులతో కలిసి రీల్స్ తీస్తున్న సమయంలో తౌసిఫ్100 అడుగుల ఎత్తు నుంచి దూకాడు.

    దింతో నీటిలో మునిగి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    Details 

    చెరువులో మునిగిపోవడంతో ఈ ప్రమాదం 

    ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ కుష్వాహ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం తౌసిఫ్ అనే 18 ఏళ్ల యువకుడు కొంతమంది స్నేహితులతో కలిసి మూసి ఉన్న రాతి గనిలో స్నానం చేసేందుకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు.

    ఈ క్రమంలో కొందరు స్నేహితులు అతడి వీడియోలు కూడా తీస్తున్నారు.

    100 అడుగుల లోతు నీటిలోకి దూకిన యువకుడు తనను తాను అదుపు చేసుకోలేక లోతు నీటిలో మునిగి మృతి చెందాడని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జార్ఖండ్

    తాజా

    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా

    జార్ఖండ్

    ధన్‌బాద్‌: అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం, 15 మంది సజీవ దహనం ప్రధాన మంత్రి
    జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక జార్ఖండ్ ముక్తి మోర్చా/జేఎంఎం
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025