NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత
    భారతదేశం

    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత

    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 07, 2023, 06:16 pm 1 నిమి చదవండి
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఘజియాబాద్ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఘజియాబాద్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టులో అయూబ్‌ను ప్రశ్నించేందుకు జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం అనుమతించింది. అయితే ట్రయల్ కోర్టులో అధికార పరిధి సమస్యపై చర్చించడానికి అయ్యూబ్‌ను న్యాయస్థానం అనుమతించింది.

    జల్సాల కోసం సొమ్మును దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపణ

    కోవిడ్ -19 రోగుల కోసం క్రౌడ్ ఫండింగ్‌ను అయ్యూబ్ ప్రారంభించారని, ఆ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణల నేపథ్యంలో అయ్యూబ్‌పై నవంబర్‌లో మనీలాండరింగ్‌తో పలు అభియోగాలు మోపారు. ఆమె జల్సాల కోసం సేకరించిన సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత ఏడాది నవంబర్ 29న ఘజియాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (ఛార్జ్ షీట్)ను పరిగణనలోకి తీసుకుని అయ్యూబ్‌కు సమన్లు ​​జారీ చేసింది. మనీలాండరింగ్ జరిగిందన్న బ్యాంకు అకౌంట్ ముంబయి పరిధిలో ఉందని, అందువల్ల విచారణ ఘజియాబాద్‌ కోర్టు పరిధిలోకి రాదని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఘజియాబాద్‌లో ఈడీ విచారణను రద్దు చేయాలని అయూబ్ తన రిట్ పిటిషన్‌లో కోరారు. ఆమె అభ్యర్థ్యను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    సుప్రీంకోర్టు
    ముంబై

    తాజా

    ప్రాణాలతో ఆడుకోకండి, మరణంపై వచ్చిన ఫేక్ వార్తలపై కోటశ్రీనివాసరావు స్పందన తెలుగు సినిమా
    హోండా షైన్ 100 vs హీరో స్ప్లెండర్ ప్లస్ ఫీచర్స్ తెలుసుకుందాం ఆటో మొబైల్
    హ్యారీ పోటర్, స్టార్ వార్స్ చిత్రాల్లో నటించిన పాల్ గ్రాంట్ కన్నుమూత సినిమా
    'అక్రమ అరెస్టులు, మైనార్టీలపై దాడులు'; భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా సంచలన నివేదిక భారతదేశం

    ఉత్తర్‌ప్రదేశ్

    ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్‌ నాయకుడు అన్సారీ అరెస్టు భారతదేశం
    ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్ తుపాకీ కాల్పులు
    ఉమేష్ పాల్ హత్య: పోలీసుల అదుపులో అతిక్ అహ్మద్ సన్నిహితుడు బల్లి పండిట్ అలహాబాద్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    సుప్రీంకోర్టు

    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ కల్వకుంట్ల కవిత
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్

    ముంబై

    కుంభకోణంతో సంబంధం ఉన్న విరాట్ కోహ్లీ వదిలిపెట్టిన ఆడి R8 సూపర్‌కార్‌ ఆటో మొబైల్
    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరు వాడుకొని రూ.కోట్లు కాజేసిన మాజీ రంజీ ప్లేయర్ ఆంధ్రప్రదేశ్
    ప్లాస్టిక్ సంచిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం; కుమార్తెపైనే అనుమానాలు మహారాష్ట్ర
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023