NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ
    తదుపరి వార్తా కథనం
    రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ
    రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ

    రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ

    వ్రాసిన వారు Stalin
    Aug 09, 2023
    12:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిటైర్డ్ జడ్జిల ప్రకటనల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత వారు చెప్పేది కేవలం వారి సొంత అభిప్రాయం మాత్రమే అవుతుందని, దాన్ని పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

    కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూత్రం గురించి మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ మాట్లాడిన నేపథ్యంలో దానికి సమాధానంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.

    1973 నాటి కేశవానంద భారతిలో తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూత్రాన్ని పేర్కొంది. రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, చట్టబద్ధమైన పాలన వంటి కొన్ని ప్రాథమిక లక్షణాలను పార్లమెంటు సవరించలేదని స్పష్టం చేసింది.

    సుప్రీంకోర్టు

    ఇంతకీ మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ఏమన్నారంటే?

    రాజ్యసభలో సోమవారం దిల్లీ సర్వీసెస్ బిల్లుపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడారు.

    కేశవానంద భారతి కేసుపై మాజీ సొలిసిటర్ జనరల్ టీఆర్ అందరుజిన్ రాసిన పుస్తకాన్ని చదివిన తర్వాత తాను ఓ నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు.

    రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూత్రం చాలా వివాదాస్పదమైన న్యాయశాస్త్ర ప్రాతిపదికను కలిగి ఉందని, దీనిపై చర్చకు అవకాశం ఉందని తాను నమ్ముతున్నట్లు జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. ఇంతకు మించి తాను ఏమీ చెప్పలేనన్నారు.

     సుప్రీంకోర్టు

    ఆర్టికల్ 370 పిటిషన్‌ విచారణ సందర్భంలో సీజేఐ వ్యాఖ్యలు

    సుప్రీంకోర్టులో జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.

    నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు.

    రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణ సూత్రం అంశంపై ప్రస్తావన వచ్చిన సందర్భంగా జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను కపిల్ సిబాల్ గుర్తు చేశారు.

    ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తాము పదవి నుంచి దిగిపోయాక ఏం మాట్లాడినా, అది వ్యక్తిగత అభిప్రాయమే అవుతుందని స్పష్టం చేశారు. దానికి రాజ్యాంగ బద్ధత ఉండదన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డివై చంద్రచూడ్
    సుప్రీంకోర్టు
    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    డివై చంద్రచూడ్

    మద్రాస్ హైకోర్టు జడ్టిగా గౌరీ ప్రమాణం, ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    హిజాబ్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక విద్యార్థినులు; బెంచ్ ఏర్పాటుకు సీజేఐ హామీ సుప్రీంకోర్టు
    శివసేన కేసు: ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు శివసేన
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు

    మాగుంట రాఘవ్‌కు సుప్రీం షాక్.. బెయిల్‌ 15 నుంచి 5 రోజులకు కుదింపు దిల్లీ
    దిల్లీలో బైక్ ట్యాక్సీలకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు  దిల్లీ
    వివేక హత్య విషయం వైఎస్ జగన్ కు ముందే తెలుసు: వైఎస్ సునీత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    వైఎస్ వివేక హత్య కేసులో స్వయంగా వాదనలు వినిపించిన సునీతారెడ్డి.. ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు; ప్రమాణ స్వీకారం చేయించిన సీజేఐ సుప్రీంకోర్టు
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    స్నేహితుల దినోత్సవం వేళ విషాదం.. కారు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి రోడ్డు ప్రమాదం
    PM Modi: 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన  నరేంద్ర మోదీ
    లోకల్ ట్రైన్‌‌లో బాంబు పెట్టామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్ ముంబై
    Gaddar Passed Away: ముగబోయిన ఉద్యమ గళం.. గద్దర్ కన్నుమూత  గద్దర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025