NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ 
    తదుపరి వార్తా కథనం
    Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ 
    కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ

    Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 24, 2024
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాళేశ్వర ప్రాజెక్ట్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌కు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు మంగళవారం హాజరయ్యారు.

    ఈ విచారణలో భాగంగా ఉన్నతాధికారులకు తెలియకుండా ఈఈ తిరుపతిరావు రూ.1,600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజినీర్లు తెలిపారు.

    కమిషన్, బ్యాంకు గ్యారంటీలను ఇవ్వడానికి ముందు ఏదైనా అండర్‌టేకింగ్ ఏజెన్సీల నుంచి నిబంధనలు లేదా హామీలు తీసుకున్నారా అని ఇంజినీర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది.

    ఈ నేపథ్యంలో, ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను విడుదల చేయకుండానే నిర్వహించారని వారు తెలిపారు.

    Details

    డిజైన్లు, డ్రాయింగ్‌లను రూపొందించిన 'వ్యాప్కోస్' సంస్థ

    డ్యామేజ్‌కు సంబంధించి, కమిషన్, ఆనకట్ట ప్రాంతంలో సీసీ బ్లాక్‌లకు జరిగిన నష్టం గురించి వివరణ కోరింది.

    ఇంజినీర్లు, 2022 జులైలో వచ్చిన భారీ వరదల కారణంగా సీసీ బ్లాక్‌లు దెబ్బతిన్నాయని వెల్లడించారు.

    డ్యామేజీ జరిగిన వెంటనే సంబంధిత ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కమిషన్‌కు తెలిపారు.

    కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్, డిజైన్లు, డ్రాయింగ్‌లు ఎవరు రూపొందించారని అడిగితే, వ్యాప్కోస్ సంస్థ తయారుచేసిందని వారు తెలిపారు.

    నిర్మాణానికి సంబంధించి సీడీఓ సీఈ అనుమతితో పనులు జరిపినట్టు చెప్పారు.

    ముఖ్యంగా నిర్మాణం జరిగే ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించడంపై కమిషన్ ప్రశ్నించగా, ఎన్‌ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయంటూ ఇంజినీర్లు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    తెలంగాణ

    Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్‌ఐలు భారతదేశం
    Hydra: 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ప్రభుత్వానికి హైడ్రా నివేదిక  హైదరాబాద్
    Hydra: హైడ్రా బలోపేతం దిశగా అడుగులు.. 23 మందిని నియమిస్తూ ఉత్తర్వులు హైదరాబాద్
    Runamafi: రుణమాఫీ కాని రైతులకు త్వరలో డబ్బులు జమ .. ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రభుత్వం ప్రభుత్వం

    ఇండియా

    Violation of Pakistan: బరితెగించిన పాకిస్థాన్.. సరిహద్దులో కాల్పులు పాకిస్థాన్
    New Medical Colleges: ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్  ఆంధ్రప్రదేశ్
    Yuzvendra Chahal: చాహల్‌ స్పిన్‌ మాయజాలం.. ఒకే మ్యాచులో ఐదు వికెట్లు  చాహల్
    Gujarat: గుజరాత్‌లో అంతుచిక్కని వ్యాధి.. ఇప్పటికే 15 మంది మృతి గుజరాత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025