Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ
కాళేశ్వర ప్రాజెక్ట్పై జరుగుతున్న విచారణలో భాగంగా, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్కు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు మంగళవారం హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా ఉన్నతాధికారులకు తెలియకుండా ఈఈ తిరుపతిరావు రూ.1,600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లు ఇంజినీర్లు తెలిపారు. కమిషన్, బ్యాంకు గ్యారంటీలను ఇవ్వడానికి ముందు ఏదైనా అండర్టేకింగ్ ఏజెన్సీల నుంచి నిబంధనలు లేదా హామీలు తీసుకున్నారా అని ఇంజినీర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో, ఈఎన్సీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్ను విడుదల చేయకుండానే నిర్వహించారని వారు తెలిపారు.
డిజైన్లు, డ్రాయింగ్లను రూపొందించిన 'వ్యాప్కోస్' సంస్థ
డ్యామేజ్కు సంబంధించి, కమిషన్, ఆనకట్ట ప్రాంతంలో సీసీ బ్లాక్లకు జరిగిన నష్టం గురించి వివరణ కోరింది. ఇంజినీర్లు, 2022 జులైలో వచ్చిన భారీ వరదల కారణంగా సీసీ బ్లాక్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. డ్యామేజీ జరిగిన వెంటనే సంబంధిత ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కమిషన్కు తెలిపారు. కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్, డిజైన్లు, డ్రాయింగ్లు ఎవరు రూపొందించారని అడిగితే, వ్యాప్కోస్ సంస్థ తయారుచేసిందని వారు తెలిపారు. నిర్మాణానికి సంబంధించి సీడీఓ సీఈ అనుమతితో పనులు జరిపినట్టు చెప్పారు. ముఖ్యంగా నిర్మాణం జరిగే ప్రదేశాల్లో పరీక్షలు నిర్వహించడంపై కమిషన్ ప్రశ్నించగా, ఎన్ఐటీ వరంగల్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయంటూ ఇంజినీర్లు వెల్లడించారు.