Kavitha: రోస్టర్ పాయింట్ల తొలగింపుతో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం: కవిత
ఉద్యోగ అవకాశాల్లో రోస్టర్ పాయింట్లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రోస్టర్ పాయింట్లను తొలగిస్తూ తీసుకొస్తూ జారీ చేసిన జోవో నంబర్ 3ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కవిత లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 3 వల్ల మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. రిక్రూట్మెంట్లలో రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళలకు 33.33 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం సరైన విధానం కాదన్నారు.