NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  Kaleswaram: 'కాళేశ్వరం'లో మహా కుంభాభిషేకం.. 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
     Kaleswaram: 'కాళేశ్వరం'లో మహా కుంభాభిషేకం.. 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు
    'కాళేశ్వరం'లో మహా కుంభాభిషేకం

     Kaleswaram: 'కాళేశ్వరం'లో మహా కుంభాభిషేకం.. 42 ఏండ్ల తర్వాత జరుగుతున్న పూజలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2025
    09:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేడు (శుక్రవారం) నుండి ఆధ్యాత్మికతతో ప్రారంభమయ్యాయి.

    42 ఏళ్ల విరామం తర్వాత ఈ మహోత్సవాలు జరగడం విశేషం. ఈ మహోత్సవం ఫిబ్రవరి 9వ తేదీ వరకు భక్తులకు భక్తి శ్రద్ధలను పెంచేలా కొనసాగనుంది.

    మహోత్సవం ప్రారంభ వేడుకలో భాగంగా ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకుని, ఐదు కలశాలలో పవిత్ర గోదావరి జలాలను సేకరించి కుంభాభిషేకానికి తీసుకువచ్చారు.

    అనంతరం గోపూజ, గణపతి పూజలతో మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

    అచ్చలాపురం రుత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ 1,108 కలశాలకు అర్చనలు నిర్వహించారు.

    వివరాలు 

    మహోత్సవాల సమయంలో భక్తులకు ప్రత్యేక మార్గదర్శకాలు 

    ఈ మూడు రోజుల పాటు ఆలయం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రకాశించనుంది.

    మహోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేయడం జరిగింది.

    గర్భగుడి దర్శనాలను కూడా నిలిపివేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

    ఫిబ్రవరి 9న ఉదయం 10:42 గంటలకు తుని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి గారి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు.

    అనంతరం పీఠాధిపతి స్వామి భక్తులకు అనుగ్రహభాషణం అందించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత ప్రసాదం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

    వివరాలు 

    భక్తులకు ఆలయ అర్చకుల పిలుపు 

    కార్యక్రమం ముగింపు సందర్భంగా దాతలకు ప్రత్యేక ఆశీర్వచనాలను అందజేయనున్నారు.

    భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

    మూడు రోజుల పాటు కాళేశ్వరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.

    భక్తులు ఈ మహోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపను పొందాలని ఆలయ అర్చకులు పిలుపునిచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    తెలంగాణ

    Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో.. పదేళ్లలో 8 లక్షల మంది విద్యార్థుల తగ్గుముఖం  భారతదేశం
    Telangana New Ration Cards : కొత్త రేషన్ కార్డు జాబితాలో మీ పేరు లేకాపోతే ఇలా దరఖాస్తు చేసుకోండి భారతదేశం
    Padamarao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు భారతదేశం
    Singer Madhu Priya: పవిత్రమైన ఆలయంలో ఇదేం పని.. వివాదంలో సింగర్ మధు ప్రియ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025