NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు'.. కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్
    తదుపరి వార్తా కథనం
    'కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు'.. కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్
    కశ్మీర్ ఎన్నికలపై ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

    'కశ్మీరీలు బిచ్చగాళ్లు కాదు'.. కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్

    వ్రాసిన వారు Stalin
    Jan 10, 2023
    05:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు అనేవి కశ్మీర్ ప్రజల హక్కు అన్నారు ఒమర్ అబ్దుల్లా. అయితే వాటిని నిర్వహంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని అడుక్కోరని చెప్పారు. కశ్మీరీ ప్రజలు బిచ్చగాళ్లు కాదని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

    ఆస్తులు, ప్రభుత్వ భూముల నుంచి ప్రజలను ఖాళీ చేయించడంపై ఆయన స్పందిసూ.. ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఇది ఒక కారణమని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం.. ప్రజల గాయాలను మాన్పడానికి ప్రయత్నిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి తెలుసునని చెప్పారు. అందుకే బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు.

    కశ్మీర్

    కశ్మీర్ ప్రజలను మోసం చేసిన బీజేపీ

    ఉగ్రవాద దాడుల నేపథ్యంలో గ్రామ రక్షణ గార్డులకు ఆయుధాలు కల్పించాలని తీసుకున్న నిర్ణయం.. కేంద్రం తన వైఫల్యాన్ని వైఫల్యాన్ని అంగీకరించడమేనని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసే సమయంలో తుపాకీ సంస్కృతి తగ్గుముఖం పడుతుందని చెప్పిన బీజేపీ.. కశ్మీర్ ప్రజలను మోసం చేసిందన్నారు.

    జమ్ము, కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవలే గ్రామ రక్షణ కమిటీలు అని పిలువబడే గ్రామ రక్షణ కమిటీలకు ఆయుధాలను ఇవ్వడం ప్రారంభించింది. రాజౌరి జిల్లాలోని ధంగ్రీ సంఘటనలో ఏడుగురు వ్యక్తులు ఉగ్రవాదులు హత్య చేసిన నేపథ్యంలో గ్రామ రక్షణ కమిటీలకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆయుధ శిక్షణ అందిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    జమ్ముకశ్మీర్

    ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు భారతదేశం
    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే? భారతదేశం
    రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025