
BRS: హరీశ్రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు.. సస్పెన్షన్ వేటు సిద్ధమైన బీఆర్ఎస్!
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. హరీశ్రావు, సంతోష్కుమార్ వంటి సీనియర్ నేతలపై కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధినేత కేసీఆర్, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కవిత మీడియా సమావేశం అనంతరం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్హౌస్లో కీలక నేతలతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్తో పాటు పలువురు సీనియర్లు హాజరయ్యారు. కవితను పార్టీలో కొనసాగిస్తే ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్టవుతుందని,అది పార్టీకి తీవ్ర నష్టం కలిగించవచ్చని మెజారిటీ నేతలు కేసీఆర్కు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Details
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి
ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే భవిష్యత్తులో పార్టీకి మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని వారు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల నడుమ పార్టీ యంత్రాంగం ఇప్పటికే కవితను దూరం పెట్టే పనిలోకి దిగిందని సమాచారం. సోషల్ మీడియాలో కవితను అన్ఫాలో కావాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. పలువురు నేతలు టీవీ చర్చల్లో ఆమె వైఖరిని బహిరంగంగానే తప్పుపడుతున్నారు. కొందరు నేతలు ఆమెను వెంటనే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Details
సొంతంగా పార్టీ పెట్టే అవకాశం?
ఇదే సమయంలో హరీశ్రావుకు మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ప్రత్యేక పోస్టులు పెడుతుండటం గమనార్హం. అంతేకాకుండా, ఒకవేళ కవితపై సస్పెన్షన్ వేటు పడితే, ఆమె తదుపరి రాజకీయ ప్రస్థానం ఏంటనే దానిపై చర్చ మొదలైంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆమె సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతకాలంగా బలోపేతం చేస్తున్న 'తెలంగాణ జాగృతి' సంస్థను రాజకీయ పార్టీగా మార్చే ప్రయత్నం చేయవచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ పెడితే 'తెలంగాణ జాగృతి'నే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశాలున్నాయని సన్నిహిత వర్గాల నుంచి టాక్ నడుస్తోంది.