NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kazipet Railway station: మారిపోనున్న'కాజీపేట్ రైల్వే స్టేషన్' రూపురేఖలు 
    తదుపరి వార్తా కథనం
    Kazipet Railway station: మారిపోనున్న'కాజీపేట్ రైల్వే స్టేషన్' రూపురేఖలు 
    మారిపోనున్న'కాజీపేట్ రైల్వే స్టేషన్' రూపురేఖలు

    Kazipet Railway station: మారిపోనున్న'కాజీపేట్ రైల్వే స్టేషన్' రూపురేఖలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    11:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మారిపోతున్నాయి. రైల్వే శాఖ "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" ద్వారా ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు అభివృద్ధి పనులు చేపడుతోంది.

    ఈ స్కీమ్‌లో భాగంగా కాజీపేట్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి.

    ప్రపంచ స్థాయి సౌకర్యాలను రైల్వే ప్రయాణీకులకు అందించేందుకు భారత రైల్వే సంస్థ భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను చేపడుతోంది.

    ఈ కార్యాచరణలో కాజీపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది.

    కాజీపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 24.5 కోట్ల రూపాయలను కేటాయించారు. దక్షిణ మధ్య రైల్వే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి డిజైన్ ఫొటోల్ని విడుదల చేసింది.

    వివరాలు 

    యాదాద్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 24.5 కోట్లతో పనులు

    "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్"లో భాగంగా కాజీపేట్ రైల్వే జంక్షన్‌ను ఆధునాతన స్టేషన్‌గా మారుస్తారని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

    ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ ముఖద్వారాల అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాల ఏర్పాట్లు, స్టేషన్లో పచ్చదనాన్ని పెంచడం, ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులను చేపడతారు.

    స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయనున్నారు. అదే విధంగా, యాదాద్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 24.5 కోట్లతో పనులు ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

    యాదాద్రి స్టేషన్‌ను ఆలయం రూపంలో అభివృద్ధి చేయనున్నారు. రైల్వే శాఖ రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో 39 స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించింది.

    వివరాలు 

    మొదటి విడతలో 21 స్టేషన్ల అభివృద్ధి

    మొదటి విడతలో 21 స్టేషన్ల అభివృద్ధి పనులు చేపడతారు. ఈ అభివృద్ధిలో భాగంగా, స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, వై-ఫై, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను అందిస్తారు.

    'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' షాపులను కూడా ఏర్పాటు చేయనున్నారు, వాటి ద్వారా స్థానిక ఉత్పత్తులకు గుర్తింపు కల్పించబడుతుంది.

    అలాగే, ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, మొక్కల పెంపకం, చిన్న గార్డెన్లు వంటి పలు ఏర్పాట్లు కూడా చేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రైల్వే శాఖ మంత్రి

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! ఆంధ్రప్రదేశ్
    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025