Inter Board: ఇంటర్బోర్డు కీలక నిర్ణయం.. లేట్ ఎంట్రీకి గ్రీన్సిగ్నల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 20, 2026
09:06 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించింది. గతేడాది అమలులో ఉన్న ఈ నిబంధనను ఈసారి కూడా కొనసాగించనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వరకు ఇంటర్ వార్షిక (థియరీ) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 9లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇదిలా ఉండగా ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఈ నెల 21, 22 తేదీల్లో జరగనున్నాయి. అనంతరం ఈ నెల 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి ముగిసిన తర్వాత ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్బోర్డు ప్రకటించింది.