తదుపరి వార్తా కథనం
Khairatabad ganesh: ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభం (వీడియో)
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 06, 2025
08:46 am
ఈ వార్తాకథనం ఏంటి
ఖైరతాబాద్లోని బడా గణేశ్ శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు ఈ మహాగణపతిని దర్శించడానికి వచ్చారు. ఈ శోభాయాత్ర రాజ్ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వరకు సాగనుంది. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనంతో ముగిసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గ్లోని నాల్గో నంబరు స్టాండులో నిమజ్జనం నిర్వహించేందుకు బాహుబలి క్రేన్ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.