Anil Chauhan: కిరానా హిల్స్ను భారత్ టార్గెట్ చేయలేదా? మాజీ సీడీఎస్ కీలక వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లోని కిరానా హిల్స్పై ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత డ్రోన్ దాడి జరగడం వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వివరణ ఇచ్చారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను దాచిన ప్రాంతంగా చెప్పుకునే కిరానా హిల్స్ను భారత బలగాలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. రాడార్లను గుర్తించేందుకు పంపిన ఓ లోయిటరింగ్ మ్యూనిషన్ ఇంధనం అయిపోవడంతో చివరకు అక్కడి కొండను ఢీకొట్టిందని తెలిపారు.
వివరాలు
భారత సైన్యం లోయిటరింగ్ మ్యూనిషన్ల వినియోగం
న్యూఢిల్లీలోని వివేకానంద కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో అనిల్ చౌహాన్ ఈ విషయాలను వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సర్గోధా, కిరానా హిల్స్ పరిసరాల్లో పాకిస్థాన్ రాడార్లను గుర్తించేందుకు భారత సైన్యం లోయిటరింగ్ మ్యూనిషన్లను వినియోగించినట్లు చెప్పారు.
సర్గోధాకు కిరానా హిల్స్ సుమారు 10 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్నట్లు వివరించారు.
రాడార్లను గుర్తించడంతోపాటు వాటిపై దాడి చేయడం ఈ డ్రోన్ల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
లోయిటరింగ్ మ్యూనిషన్లకు పరిమితమైన ఆపరేషనల్ సమయం ఉంటుందని అనిల్ చౌహాన్ చెప్పారు.
దాదాపు రెండు గంటల పాటు నిర్దేశిత లక్ష్యం కోసం గాలించినా టార్గెట్ గుర్తించకపోతే.. చివరకు అవి ఏదో ఒక ప్రాంతాన్ని ఢీకొనే అవకాశం ఉంటుందని వివరించారు.
వివరాలు
కిరానా హిల్స్ ఘటన అనుకోకుండా జరిగిన పరిణామమే3
ఇదే విధంగా ఇంధనం తగ్గిపోవడంతో ఓ డ్రోన్ కిరానా హిల్స్ ప్రాంతంలోని కొండను ఢీకొట్టిందని తెలిపారు.
కిరానా హిల్స్ను భారత బలగాలు కావాలనే లక్ష్యంగా చేసుకోలేదని అప్పటి భారత వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి చేసిన ప్రకటనను కూడా అనిల్ చౌహాన్ ప్రస్తావించారు.
తాజా వివరణతో కిరానా హిల్స్ ఘటన అనుకోకుండా జరిగిన పరిణామమేనన్న విషయం మరింత స్పష్టమైనట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్లో మరో కీలక పరిణామాన్ని కూడా మాజీ సీడీఎస్ గుర్తు చేసుకున్నారు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని స్కార్దూపై దాడి చేసేందుకు భారత వైమానిక దళానికి తాను అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
వివరాలు
భోలారి దాడి ఆపరేషన్ సిందూర్లో కీలకమైన దాడుల్లో ఒకటి
అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ దాడిని చివరకు రద్దు చేసి మరో లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు వివరించారు.
సర్గోధాపై దాడి చేయాలా అని వైమానిక దళ అధిపతి తనను అడిగినప్పుడు అనుమతి ఇచ్చానని అనిల్ చౌహాన్ తెలిపారు.
అదే సమయంలో మరో రెండు లక్ష్యాలను గుర్తించాలని సూచించినట్లు చెప్పారు.
వాటిలో స్కార్దూ కూడా ఒకటని, అయితే అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో లక్ష్యాన్ని భోలారి వైపు మార్చినట్లు వెల్లడించారు.
గతేడాది మే 10న భారత వైమానిక దళం నిర్వహించిన భోలారి దాడి ఆపరేషన్ సిందూర్లో కీలకమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది.
గుజరాత్లోని గాంధీనగర్ కేంద్రంగా పనిచేసే సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఈ ఆపరేషన్ను చేపట్టింది.
వివరాలు
భోలారి ప్రాంతంలోని ఓ హ్యాంగర్పై దాడి
భోలారి ప్రాంతంలోని ఓ హ్యాంగర్పై జరిగిన దాడికి సంబంధించిన శాటిలైట్ చిత్రాల్లో భవనం పైకప్పు తీవ్రంగా దెబ్బతినడం, కొన్ని భాగాలు లోపలికి కూలిపోవడం, చుట్టుపక్కల శిథిలాలు చెల్లాచెదురుగా కనిపించినట్లు సమాచారం.
దీంతో భోలారిపై భారత వైమానిక దళం దాడి నిర్దిష్ట లక్ష్యాన్ని ఉద్దేశించే జరిగిందన్న అంచనాలు అప్పట్లో వెలువడ్డాయి.
తాజాగా కిరానా హిల్స్ ఘటనపై జనరల్ అనిల్ చౌహాన్ ఇచ్చిన వివరణతో ఆ ప్రాంతంలో అసలు ఏం జరిగిందన్న అంశంపై మరింత స్పష్టత వచ్చినట్లయింది.