LOADING...
Kolkata: వర్షాలతో కోలకతా అతలాకుతలం.. ఐదుగురు మృతి
వర్షాలతో కోలకతా అతలాకుతలం.. ఐదుగురు మృతి

Kolkata: వర్షాలతో కోలకతా అతలాకుతలం.. ఐదుగురు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతా (Kolkata)లో సోమవారం రాత్రంతా భారీ వర్షం కురిసింది. నగరంలోని వీధులన్నీ జలమయం అవడంతో పర్యాటకులు, స్థానికులు సమస్యలు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కోల్‌కతాలో అయిదుగురు మృతిచెందారు. మాహానాయక్ ఉత్తమ్ కుమార్, రబీంద్ర సరోబర్ స్టేషన్ మార్గంలో నీరు నిలిచిపోయింది, దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు.

Details

మెట్రో సర్వీసులు నిలిపివేత

ప్రయాణికుల క్షేమం కోసం షాహిద్ ఖుదిరామ్, మైదాన్ స్టేషన్ల మధ్య మెట్రో సర్వీసులు నిలిపివేశారు. అయితే దక్షిణేశ్వర్, మైదాన్ స్టేషన్ల మధ్య ట్రంక్ సర్వీసులు కొనసాగుతున్నాయి. నీరు నిలిచిన ప్రాంతాల్లో పంపుల ద్వారా నీటిని తొలగించడానికి చర్యలు తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ షాపులు జలమయమయ్యాయి. హౌరా ప్రాంతంలో కూడా వర్షం కారణంగా అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.