NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్ 
    తదుపరి వార్తా కథనం
    KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్ 
    KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్

    KU Ragging: కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్​.. 81 మంది విద్యార్థినుల సస్పెండ్ 

    వ్రాసిన వారు Stalin
    Dec 23, 2023
    12:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    KU Ragging: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌ కలకలం రేపుతోంది. అది కూడా ఉమెన్స్ హాస్టల్ అయిన పద్మావతి వసతి గృహంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది.

    ర్యాగింగ్‌‌కు పాల్పడిన 81 మంది విద్యార్థినులను హాస్టల్స్ నుంచి అధికారులు సస్పెండ్ చేశారు.

    కేయూ ఏర్పడినప్పటి నుంచి ఇంత మందిని ఒకేసారి సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

    వాస్తవానికి కొన్నిరోజులుగా యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతుందంటూ.. ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కొందరు జూనియర్ విద్యార్థులు కూడా యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.

    కేయూ

    పరిచయ కార్యక్రమాల పేరుతో వేధింపులు

    జూనియర్ విద్యార్థినుల ఫిర్యాదు మేరకు విచరాణ చేపట్టిన అధికారులు.. ర్యాగింగ్ జరుగుతుందని నిర్ధారించారు.

    పరిచయ కార్యక్రమాల పేరుతో జూనియర్లను సీనియర్ అమ్మాయిలు వేధిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

    ఈ మేరకు ర్యాగింగ్‌పై నివేదికను తయారు చేసిన అధికారులు.. కేయూ రిజిస్టార్‌కు అందజేశారు.

    ర్యాగింగ్‌కు పాల్పడిన 81 మంది అమ్మాయిలను కేయూ రిజిస్టార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో కామర్స్, ఎకనామిక్స్, జువాలజీల్లో గ్రూపులకు చెందిన సీనియర్ విద్యార్థినులు ఉన్నారు.

    సస్పెండ్ అయిన విద్యార్థినులు వెంటనే హాస్టల్స్ ఖాళీ చేయాలని రిజిస్టార్ ఆదేశించారు. ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యూనివర్సిటీ
    వరంగల్ పశ్చిమ
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    యూనివర్సిటీ

    NIRF Ranking 2023: దేశంలోని విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసిన కేంద్రం; టాప్-10 ఇవే విద్యా శాఖ మంత్రి
    పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో హోలీ నిషేదం పాకిస్థాన్
    తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు తెలంగాణ
    యోగి స్వస్థలంలో దారుణం: యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి ఉత్తర్‌ప్రదేశ్

    వరంగల్ పశ్చిమ

    రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ తెలంగాణ
    10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్ బండి సంజయ్
    సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం  తెలంగాణ
    తెలంగాణ కొత్త రాష్ట్రమే కావచ్చు, కానీ దేశ చరిత్రలో పాత్ర చాలా గొప్పది: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    Uttam Kumar Reddy: ఎవరినీ వదిలిపెట్టం: కాళేశ్వరం బ్యారేజీ పిల్లర్ల కుంగిపోడవంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం  ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    YSR Aarogya Sri: ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ.. చికిత్స పరిమితి రూ.25లక్షలకు పెంపు ఆరోగ్యశ్రీ
    Congress: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన కాంగ్రెస్ తెలంగాణ
    RBI: 2022-23లో బ్యాంకులకు రూ.40.4కోట్ల పెనాల్టీ విధించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025