NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!
    పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!

    Pahalgam attack: పహల్గాం దాడి వెనక కశ్మీర్‌ నుంచి పాకిస్థాన్‌కు పారిపోయిన లష్కరే ఉగ్రవాది ఫరూఖ్‌ నెట్‌వర్క్‌..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 30, 2025
    11:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి, కశ్మీర్‌ నుంచి పారిపోయి ప్రస్తుతం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఓ ఉగ్రవాది నెట్‌వర్క్‌ ఈ దాడికి సాయపడినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) స్పష్టంచేసింది.

    ఈ కుట్రకు లష్కరే తోయిబా సంస్థకు చెందిన కమాండర్‌ ఫరూఖ్‌ అహ్మద్‌ తేడ్వా కీలకంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు.

    ఇటీవలే భద్రతా బలగాలు అతడి స్వస్థలమైన కుప్వారాలోని ఇంటిని పేల్చివేశాయి.

    గత రెండు సంవత్సరాల్లో కశ్మీర్‌ లోయలో జరిగిన అనేక ఉగ్రదాడులకు అతడు సహకరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

    వివరాలు 

    పాకిస్తాన్‌, భారత్ మధ్య పలుమార్లు ప్రయాణించిన రికార్డులు

    ఫరూఖ్‌కు కశ్మీర్‌లోని పర్వతాలు, లోయల్లో దారి మార్గాలపై పూర్తి అవగాహన ఉంది.

    భారత్‌లోకి ఉగ్రవాదులను చొరబడించేందుకు అతడు మూడురకాల మార్గాలను వినియోగించి సాయం చేశాడు.

    పాకిస్తాన్‌లో అతడికి బలమైన సంబంధాలు ఉండటంతో, 1990 నుంచి 2016 మధ్యకాలంలో పాకిస్తాన్‌, భారత్ మధ్య పలుమార్లు ప్రయాణించిన రికార్డులు ఉన్నాయి.

    పహల్గాం దాడి అనంతరం అతడికి సహకరించిన అనేకమందిని అధికారులు అరెస్ట్ చేశారు.

    ప్రస్తుతం పాక్‌లో తలదాచుకున్న ఫరూఖ్‌ తన కశ్మీర్‌ నెట్‌వర్క్‌తో సంబంధాలు కొనసాగించేందుకు సురక్షిత కమ్యూనికేషన్‌ యాప్స్‌ను ఉపయోగిస్తున్నట్టు సమాచారం.

    వివరాలు 

    ఉగ్రవాదుల వద్ద ప్రత్యేక యాప్‌లు, అల్ట్రాసెట్లు   

    పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సాధారణంగా పర్వతారోహకులు ట్రెక్కింగ్ కోసం ఉపయోగించే 'ఆల్పైన్ క్వెస్ట్‌' అనే నావిగేషన్ యాప్‌ను ఆఫ్‌లైన్ మోడ్‌లో వాడినట్లు భావిస్తున్నారు.

    ఈ యాప్ వినియోగం వల్ల వారి స్థానాన్ని గుర్తించడం భద్రతా బలగాలకు కష్టతరమయ్యింది.

    అంతేకాకుండా, ఉగ్రవాదుల వద్ద అల్ట్రాసెట్లు ఉన్నట్లు విచారణలో తేలింది.

    2023 నుంచి కశ్మీర్‌లో ముష్కరులు వీటిని వినియోగిస్తున్నారు. ఈ అల్ట్రాసెట్లు సాధారణ జీఎస్ఎం, సీడీఎంఏ మొబైల్‌ ఫోన్ల మాదిరిగా కాకుండా, ప్రత్యేకమైన రేడియో నెట్‌వర్క్‌ ద్వారా పనిచేస్తాయి.

    ఫోన్లకు అనుసంధానించి, ఎన్‌క్రిప్టెడ్ సందేశాలను పంపించడానికి వీటిని వినియోగిస్తున్నారు.

    మునుపు కేవలం మెసేజ్‌లకే పరిమితమైన ఈ పరికరాలు, ఇప్పుడు చిన్న వాయిస్ నోట్‌లు, వీడియోలు పంపించే సామర్థ్యం కలిగి ఉన్నాయి.

    వివరాలు 

    5-10 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి

    ఈ పరికరాల సిగ్నల్స్‌ను పసిగట్టినప్పటికీ, వాటి సరిగ్గా ఉన్న ప్రదేశాన్ని గుర్తించడం కష్టమవుతోంది.

    సాధారణంగా 5-10 కిలోమీటర్ల వ్యాసార్థంలో గాలింపు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

    పహల్గాం దాడి అనంతరం కూడా అల్ట్రాసెట్ల సిగ్నల్స్‌ను గుర్తించినప్పటికీ, అవి గమనించిన ప్రదేశాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పహల్గాం ఉగ్రవాద దాడి

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    పహల్గాం ఉగ్రవాద దాడి

    Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే భారతదేశం
    Pahalgam Attack video: పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొత్త వీడియో.. తెలీకుండానే రికార్డ్‌ చేసిన టూరిస్ట్‌!  భారతదేశం
    Pakistani Nationals: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు.. భారతదేశం
    Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పాకిస్తాన్ ఉగ్రవాది.. మాజీ స్పెషల్ ఫోర్స్ కమాండో  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025