NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yadadri: యాదాద్రిలో భారీ పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య!
    తదుపరి వార్తా కథనం
    Yadadri: యాదాద్రిలో భారీ పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య!
    యాదాద్రిలో భారీ పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య!

    Yadadri: యాదాద్రిలో భారీ పేలుడు.. మూడుకు చేరిన మృతుల సంఖ్య!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 30, 2025
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో గల ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో జరిగిన భారీ పేలుడు మరొకసారి విషాదం మిగిల్చింది.

    ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడు చేరింది. మృతుల్లో ఒకరు ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కల్వల నరేశ్‌ (30) కాగా, బుధవారం నాడు మరో ఇద్దరిని గుర్తించారు.

    వీరిలో కాటేపల్లి గ్రామానికి చెందిన జి.సందీప్, మోటకొండూరు మండల కేంద్రానికి చెందిన సీహెచ్‌ దేవీచరణ్ ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకొని వీరిద్దరూ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.

    ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో చోటుచేసుకుంది. ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో 18ఏ బ్లాక్‌ భవనంలో ఈ పేలుడు సంభవించింది.

    Details

    పూర్తిగా కూలిపోయిన భవనం

    క్వారీల్లో ఉపయోగించే బాంబుల ముడిసరకుల తయారీ జరుగుతున్న సమయంలో అగాధం సంభవించింది. పేలుడు తీవ్రతతో భవనం పూర్తిగా కూలిపోయింది.

    ఈ ఘటన జరిగేటప్పటికీ తొమ్మిది మంది కార్మికులు భవనంలో ఉన్నారు. కల్వల నరేశ్‌ను తీవ్ర గాయాలతో హైదరాబాద్‌కు తరలించే ప్రయత్నంలో మార్గం మధ్యలోనే మృతి చెందాడు.

    మరో నలుగురు కార్మికులు- బి.శ్రీకాంత్(కాచారం), ఎస్‌.మహేందర్(పెద్దకందుకూరు), బి.లింగస్వామి (పులిగిల్ల), ఆర్‌.శ్రీకాంత్(చాడ) తీవ్రంగా గాయపడ్డారు.

    వీరిని హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ప్రమాద స్థలాన్ని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పరిశీలించారు.

    భద్రతా పరంగా కంపెనీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పేలుడు ఘటనపై అధికారులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పరిశ్రమలో భద్రతాపరమైన లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యాదాద్రి

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    యాదాద్రి

    తెలంగాణను వరించిన 5 యాపిల్ అవార్డులు.. యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ గుర్తింపు తెలంగాణ
    శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్‌ జనరల్‌గా తెలుగు వ్యక్తి.. బాధ్యతలు స్వీకరించిన శ్రీకర్ రెడ్డి అమెరికా
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే! భారతదేశం
    Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025